Meeku Mathrame Cheptha censor review కత్తెర పడకుండా బయటకొచ్చిన ‘మీకు మాత్రమే చెప్తా’

Meeku mathrame cheptha ready to release after censor clearance

Vijay Devarakonda, Meeku Mathrame Cheptha, King Of The Hill production, tharun bhascker, Abhinav gomatam, Vani bhojan, Anasuya Bharadwaj, Shammer Sultan, Tollywood, censor review, Tollywood, movies, entertainment

Hero Vijay Devarakonda's debut production venture Meeku Matrame Chepta which is releasing on his King Of The Hill production banner is set to release on November 1st. The film completed its censor formalities earlier today and was certified clean remotely U/A without any cuts.

కత్తెర పడకుండా బయటకొచ్చిన ‘మీకు మాత్రమే చెప్తా’

Posted: 10/29/2019 01:48 PM IST
Meeku mathrame cheptha ready to release after censor clearance

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ స్థాపించిన నిర్మాణ సంస్థ కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై నిర్మించిన తొలి చిత్రం ‘‘మీకు మాత్రమే చెప్తా’’. తనను హీరోగా పరిచయం చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా పరిచయం చేస్తున్నారు. అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం సోమవారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్స్ చెప్పకుండా యు/ఎ సర్టిఫికెట్ జారీ చేశారు.

షమీర్ సుల్తాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కాగా, సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు ‘మీకు మాత్రమే చెప్తా’ టీంను అభినందించారని చిత్ర యూనిట్ వెల్లడించింది. న్యూ ఏజ్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపోందిన ఈ సినిమా పరిశ్రమతో పాటు ప్రేక్షకులలోనూ అటెన్షన్‌ని క్రియేట్ చేసింది. టీజర్, ట్రైలర్‌తో పాటు విజయ్ దేవరకొండ చేసిన ప్రొమోషనల్ వీడియో సాంగ్ ‘నువ్వే హీరో’కు మంచి రెస్సాన్స్ వచ్చింది.

ఇదిలా ఉంటే, తమ సినిమా సెన్సార్ పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్మాత విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘‘సెన్సార్ సభ్యులు నుంచి మంచి రెస్సాన్స్ వచ్చింది. సినిమా నిర్మాణంలో అడుగు పెట్టిన మాకు మొదటి సినిమా ‘మీకు మాత్రమే చెప్తా’ చాలా స్పెషల్‌గా నిలుస్తుంది. కొత్త తరహా ఆలోచనలను ప్రోత్సహించేందుకు కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్‌టైన్మెంట్ ఎప్పుడూ ముందు ఉంటుంది. ఈ సినిమా యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుందన్న నమ్మకం మాకు ఉంది.

అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా ‘మీకు మాత్రమే చెప్తా’ నిలుస్తుంది’’ అని చెప్పారు. కాగా, ఈ సినిమాలో తరుణ్ భాస్కర్, అనసూయ భరద్వాజ్‌తో పాటు అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ ఇతర పాత్రల్లో నటించారు. శివకుమార్ సంగీతం సమకూర్చారు. మదన్ గుణదేవా సినిమాటోగ్రఫీ అందించారు. విజయ్ దేవరకొండ, వర్ధన్ దేవరకొండ నిర్మాతలు. రచన-దర్శకత్వం షమీర్ సుల్తాన్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles