టాలీవుడ్ యువ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నిర్మాతగా 'మీకు మాత్రమే చెప్తా' రూపొందింది. తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రధారిగా నిర్మితమైన ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్.. వాణి భొజన్.. అభినవ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. పూర్తి వినోదభరితంగా రూపొందిన ఈ సినిమాకి షమ్మీర్ సుల్తాన్ దర్శకుడిగా వ్యవహరించాడు.
పోస్టు ప్రొడక్షన్ పనులు చివరి దశకి చేరుకుంటున్నాయి. నవంబర్ 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చారు. మంచివాళ్లమనే పేరు కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తుంటారు. ఆ ఇమేజ్ ను డామేజ్ చేసే చిన్నతప్పు జరిగినప్పుడు, దానిని సరిదిద్దుకునే క్రమంలో నుంచి పుట్టే కామెడీగా ఈ సినిమా సాగుతుందని చెబుతున్నారు. ఈ సినిమాతో తరుణ్ భాస్కర్ నటుడిగా బిజీ అవుతాడేమో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more