సినిమాల్లోనే కాదు.. రాజకీయాలతో కూడా చరిత్రలో తనకంటూ కొన్ని ప్రత్యేక పేజీలను పదిలపరుచుకున్న వ్యక్తి జయలలిత. తీవ్ర అనారోగ్యంతో ఆమె చనిపోవటంతో దేశం మొత్తం విషాదంలో ముంచేసింది. కథానాయకిగా సినీరంగంలో వెలుగు వెలిగిన ఆమె అంతే వేగంతో రాజకీయాల్లో దూసుకుపోయి అమ్మగా మారిపోయింది. ఆమె మృతితో కోలీవుడ్ తోపాటు యావత్ దేశంలోని నటులంతా దిగ్భ్రాంతి వ్యక్తిం చేస్తున్నారు. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్, కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీ కాంత్, అమితాబ్ బచ్చన్ ఇలా అంతా తమ సంతాపం తెలిపారు.
తమిళనాడు ఒక సాహసోపేతమైన మహిళా నాయకురాల్ని కోల్పోయిందని, ఆమె మృతి తీరనిలోటని విచారం వ్యక్తం చేశారు. ఆమె ఒక ఫైటర్ , అందరికీ స్పూర్తి ప్రదాత అంటూ ప్రముఖ నటి రాధిక శరత్ కుమార్ ట్వీట్ చేశారు. ఆమె మరణం తమిళ ప్రజలకు తీరని లోటు..కానీ వారి గుండెల్లో శాశ్వతంగా మిగిలిపోతారని, ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. వీరందరితో పాటు పార్తీపన్, మాధవన్, నకుల్ , జయం రవి తదితర పలువురు సినీ ప్రముఖులు జయలలిత ఆత్మకు శాంతి కలగాలంటూ ట్వీట్స్ చేసాడు.
— Rajinikanth (@superstarrajini) December 5, 2016
Der will never be another U #ironlady #TamilNadusdaughter #myalmamatter #ChurchParkian #mostcherishedmemories #darkestdayinTN #heartbroken pic.twitter.com/DUa4159DO4
— Trisha Krishnan (@trishtrashers) December 5, 2016
వందేళ్ల భారతీయ సినీ వేడుకలో అన్ని రాష్ట్రాల నుంచి పాల్గొన్న ఏకైక ముఖ్యమంత్రి జయలలిత. ఆమె నటి కావటం మా అదృష్టం అని అమితాబ్ ట్వీటాడు.
T 2463 - Jayalalitha ji the only CM of a State that celebrated 100 years of Indian Cinema .. from all regions .. most admirable ! pic.twitter.com/W2pcsVKhYL
— Amitabh Bachchan (@SrBachchan) December 5, 2016
జయలలితగారి మరణం తమిళులకే కాదు.. మా అందరికీ కూడా దిగ్భ్రాంతి కలిగించిందని బాద్ షా షారూఖ్ పేర్కొన్నాడు.
ఇక కోలీవుడ్ నటీమణులంతా అమ్మకి తమ శైలిలో నివాళులర్పించారు. స్వర్గంలో ఆమెకోసం మరోసింహాసనం ఎదురుచూస్తోందని హీరోయిన్ త్రిష ట్వీట్ చేశారు. తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి జయలలిత అంటూ ఆమె సంతాపం ప్రకటించారు. ఆమెను కలవడం అదృష్టమనీ, చాలా గర్వంగా ఉందంటూ జయలలిత కలిసిన క్షణాలను ఆమె గుర్తు చేసుకున్నారు. అతి ధైర్యవంతమైన మహిళల్లో జయలలిత ఒకరని శృతి హాసన్ ట్వీట్ చేశారు. తమిళనాడు అత్యంత సాహసోపేతమైన మహిళా నాయకురాలని కోల్పోయిందని, ఆమె మృతి తీరనిలోటని విచారం వ్యక్తం చేశారు.
ఆమె ఒక ఫైటర్ , అందరికీ స్పూర్తి ప్రదాత అంటూ ప్రముఖ నటి రాధిక శరత్ కుమార్ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి జయలలిత మరణం తమిళ ప్రజలకు తీరని లోటు..కానీ వారి గుండెల్లో శాశ్వతంగా మిగిలిపోతారని, ఆత్మకు శాంతి కలగాలని రాధిక ప్రార్థించారు.
స్టార్ డైరక్టర్ గౌతం వాసు దేవ్ మీనన్, పార్తీపన్, మాధవన్, నకుల్ , జయం రవి, పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా జయలలిత ఆత్మకు శాంతి కలగాలంటూ ట్వీట్స్ చేసారు. మరోపక్క ప్రణబ్, మోదీ, రాహుల్ తో పాటు పలువురు రాజకీయ నేతలు ఆమెకు నివాళులర్పించినవారిలో వున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more