ఇటీవల కన్నడంలో 6-2=5 పేరుతో విడుదలయ్యి సంచలన విజయం సాధించింది. ఈ చిత్రం చూసిన ప్రేక్షకులు ఇది చిత్రమా లేక నిజమా అనే సందిగ్దంలో పడ్డారు. ఏమాత్రం డ్రమటిక్ ఎలిమెంట్స్ లేకుండా ఓ అడవిలో ట్రక్కింగ్ కి వెల్లిన ఆరుగురు ఫ్రేండ్స్ చుట్టూ తిరిగే కథగా తెరపై కనిపిస్తుంది. కాని సినిమా కి ఏమాత్రం తగ్గకుండా రియల్ ఇన్సిడెంట్ మన కళ్ళముందు జరుగుతున్న మధురానుభూతిని కలిగిస్తుంది. ఇప్పుడు ఏప్రిల్ 3న తెలుగు లో ఆదే ఫుటేజ్ ని తీసుకుని తెలుగు ప్రేక్షకులకి గుడ్సినిమా గ్రూప్ మరియు శ్రీ శైలేద్ర ప్రోడక్షన్స్ బ్యానర్ లు సంయుక్తంగా అందిస్తున్నారు. అసలు ఈ స్టోరి చిత్రమా నిజమా అనే దాన్ని బేస్ చేసుకుని చిత్రం కాదు నిజమ్ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు నిర్మాతలు.
అసలు జరిగిన విషయానికోస్తే..
Video Courtesy: idlebrainlive
2010లో ఆరుగురు ఫ్రెండ్స్ సరదాగా ట్రక్కింగ్ చేయడానికి మంగుళూరు కు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ అడవిలోకి వెళ్లి, కనిపించకుండా పోయారు. అప్పుడు వాళ్లు తీసుకెళ్లిన కెమెరా 2012లో దొరకగా అందులోని విజువల్స్ లో వాళ్లు ఏ విధంగా కనపడకుండా పోయారో తెలిసింది. ఆ విజివల్స్ చూసిన అటవిశాఖ వారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఓ విధంగా వారి మనసు కలిచివేసింది. ఆ విషయం ఆనోటా ఈనోటా బయటకి పొక్కి కన్నడలోని కొందరు ఈ విజవల్స్ ని చూడాలనుకున్నారు. అనుకొవటమే తరువాయి అటవిశాఖ వారిని సంప్రదించి ఆ విజువల్స్ ని చూశారు. వారి హ్రుదయం బరువెక్కింది. ఈ విజువల్స్ ని ఎలాగైనా సినిమా రూపం లో ప్రేక్షకులకి అందించాలనుకుని అటవిశాఖలో ఉన్నతాధికారుల అనుమతి తీసుకుని ఇప్పుడు ఆ విజువల్స్ ని సినిమా రూపంలో ఎడిటింగ్ చేసి, యథావిధిగా, అటవీశాఖ అనుమతితో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది వినడానికి వింతగా ఉన్నాచిత్రమ్ కాదు నిజమ్...చిత్ర పరిశ్రమలోనే ఓ అరుదైన రికార్డుగా నిలుస్తుంది. ఇప్పుడు ఈ యధార్దసంఘటనని ఈరోజుల్లో, రొమాన్స్, విల్లా, భద్రమ్ వంటి విజయవంతమైన వైవిధ్యమైన చిత్రాల్ని అందించిన గుడ్ సినిమా గ్రూప్, శ్రీ శైలేంధ్ర ప్రొడక్షన్స్ తో కలిసి సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకి అందిస్తున్నారు. రమేష్ ఈ ఫుటేజ్ ని షూట్ చేశారు.అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుంది, ఏప్రిల్ 3 న విడుదలవుతుంది.
ఈ చిత్ర విశేషాల గురించి నిర్మాత జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ " ఓ అరుదైన సంఘటన ఆధారంగా రూపొందించి చిత్రం గా తీసుకొస్తున్నాం. మంగుళూరుకు సమీపంలోని ఫారెస్ట్ లో ఆరుగురు ఫ్రెండ్స్ కనిపించకుండా పోయిన సంఘటనల సమాహారమే 'చిత్రమ్ కాదు నిజమ్'. వాళ్లు కనిపించకుండా పోయినా...వారికి సంబంధించిన కెమెరా ఒకటి దొరికింది. అందులోని విజువల్సే చిత్రమ్ కాదు నిజమ్. అంటే ఏ ట్రూ ఫుటేజ్ ఫిల్మ్. అటవీశాఖ అనుమతి తీసుకొని ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. ఈరోజుల్లో, రొమాన్స్, భద్రమ్, విల్లా వంటి వైవిధ్యమైన చిత్రాల్ని అందించిన గుడ్ సినిమా గ్రూప్...' చిత్రమ్ కాదు నిజమ్' వంటి అద్భుతమైన సినిమా అందిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ చిత్రాన్ని శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ తో కలిసి రిలీజ్ చేస్తున్నాం. ఏప్రిల్ 3న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం" అని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more