దేశ 69వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల వేడుకలు జరుపుకోనున్న నేపథ్యంలో మార్కట్లు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. వారాంతంలో బ్యాంకింగ్ రంగ షేర్లతో పాటు అటో, ఐటీ, ఫార్మా సూచీలు అత్యధిక లాభాలను సొంతం చేసుకున్నాయి. ఆర్థిక సంక్షోభాన్ని భర్తి చేసుకునేందుకు చైనా తన కరెన్సీ యువాన్ విలువను మరింత తగ్గించిన నేపథ్యంలో యావత్ ప్రపంచ మార్కెట్లు పతనాన్ని చవిచూసినా.. భారతీయ సూచీలు మాత్రం లాభాలను ఆర్జించాయి. దానికి తోడు ఇండిపెండెన్స్ డే సెంటిమెంట్ కూడా ఫలించడంతో మదుపరులు కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. అటు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కూడా ముగియడంతో ఇన్నాళ్లు కీలక బిల్లు అమోదంపై దోబుచులాడిన మార్కెట్లు ఇవాళ భారీ లాభాలను ఆర్జించాయి.
దీనికి తోడు మెండి రుణాలను సేకరణతో పాటు జాతీయ బ్యాంకుల వ్యాపారాభివృద్దికి క్యాపిటల్ ఇన్ ఫ్యూషన్ సహా నూతన నియామకాల చేపట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ త్వరలో ప్రకటన చేస్తారన్న వార్తల నేపథ్యంలో మార్కెట్లు లాభాల బాటలో పరుగులు పెట్టాయి. ఇవాళ ఉదయం ప్రారంభం నుంచే దేశీయ మార్కెట్లు లాభాల బాటలో నడిచాయి. నిన్న స్వల్ప లాభాలను ఆర్జించిన మార్కెట్లు ఇవాళ ఉదయం నుంచి కూడా సానుకూల పవనాల మధ్య లాభాలను అదిమిపట్టుకున్నాయి. ఉదయం 100 పాయింట్ల లాభంతో లాభాలలో దూసుకెళ్లిన సెన్సెక్స్, మధ్యాహ్నం 12 గంటల సమాయానికి 400 పాయింట్లను ఆర్జించింది. అటు నిఫ్టీ కూడా 8500 మార్కును తిరిగి రాబట్టుకుంది.
సెంటిమెంట్ల మధ్య మార్కెట్ లో లాభాలు అంతకంతకు పెరుగతూనే ముగిశాయి.. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి 518 పాయింట్లు లాభాన్ని ఆర్జించి సెన్సెక్స్ 28 వేల 67 పాయింట్ల వద్ద ముగియగా, నిప్టీ కూడా 163 పాయింట్ల లాభంతో 8519 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ నేపథ్యంలో ఇవాళ 1795 సంస్థల షేర్లు లాభాలను ఆర్జించగా, 1057 సంస్థల షేర్లు నష్టాలను చవిచూశాయి. కాగా 129 సంస్థల షేర్లు తటస్థంగా వున్నాయి. బ్యాంకింగ్, బ్యాంకింగ్ నిఫ్టీ, అటో, ఐటీ, క్యాపిటల్ గూడ్స్, మద్య తరహా పరిశ్రమల సూచీలు కూడా భారీ లాభాలను ఆర్జించగా, మిగిలిన అన్ని సూచీలు స్వల్ప లాభాలను ఆర్జించాయి. ఏ ఒక్క సూచీ కూడా ఇవాళ నష్టాల బాటలో పయనించలేదు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more