పదేళ్ళుగా అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగులో మంచి ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమాలను అందిస్తున్న మా టీవి తన వాటాను 30 శాతం ప్రముఖ టెలివిజన్ ఛానల్ అయిన సోనీ టీవికి విక్రయించింది. ఈ మేరకు రెండు సంస్థల మధ్య సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది. 30 శాతం వాటాకు సోనీ పిక్చర్స్ టెలివిజన్ ఎంత చెల్లిస్తుందనే విషయం మాత్రం స్పష్టం కాలేదు. మా టీవీ విలువ మదింపు వేసే ప్రక్రియ కొనసాగుతున్నట్టుగా తెలిసింది.
మా టీవీ చానెల్స్ నెట్వర్క్లో నిమ్మగడ్డ (మాట్రిక్స్) ప్రసాద్ మెజార్టీ షేర్హోల్డర్ కాగా ప్రముఖ నటుడు, కాంగ్రెస్ నాయకుడు చిరంజీవి ఆయన బం«ధువు అల్లు అరవింద్, మరో ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఇతర వాటాదాలుగా ఉన్నారు. ఈ నలుగురి ఉమ్మడి వాటా 95 శాతం కాగా అందులో ప్రసాద్ వాటానే 60 శాతంపైగా ఉన్నట్టు తెలిసింది. సోనీ టెలివిజన్ కొనుగోలు చేస్తున్న 30 శాతం వాటాలో కొంతభాగాన్ని ప్రస్తుత వాటాదారులు విక్రయిస్తారు.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more