ముస్లిములు పవిత్ర మాసం రంజాన్. ఈ మాసంలో వారు సుదీర్ఘంగా ఉపవాసాలు వుంటారు. ఉదయం 4.30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ముగిసే ఈ ఉపవాసంలో కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా అలాగే వుంటారు. దాంతో వారు తిరిగి తమ శక్తిని పొందేందుకు కొన్ని ప్రత్యేకమైన వంటకాలను తీసుకుంటారు. అటువంటి వంటకాలలో మరీ ముఖ్యమైంది ‘‘హలీమ్’’. సాధారణంగా ఇది రంజాన్ మాసంలో కేవలం ముస్లిముల కోసం చేసినా... అన్యమతాలవారు దీనిని సేవిస్తారు. అటువంటి బహురుచికరమైన ఈ హలీమ్ ను తయారు చేసే విధానం గురించి మనం తెలుసుకుందాం..
వెజిటేబుల్ హలీమ్ :
కావలసిన పదార్థాలు :
క్యారట్ తరుగు,
బీట్ రూట్ తరుగు,
బీన్స్ తరుగు - పావు కప్పు చొప్పున;
బంగాళదుంప ముక్కలు - అర కప్పు;
బఠాణీలు - పావు కప్పు;
పచ్చి మిర్చి తరుగు - 2 టీ స్పూన్లు;
గోధుమరవ్వ - అర కిలో;
నెయ్యి - 200 గ్రా;
జీడిపప్పు పలుకులు - పావు కప్పు;
పిస్తా పప్పు - పావు కప్పు;
బాదం పలుకులు - పావు కప్పు;
మిరియాలు - టీ స్పూను; ఏలకులు - 4;
పసుపు - 2 టీ స్పూన్లు;
ఉప్పు - తగినంత;
పుదీనా ఆకులు - అర కప్పు;
నిమ్మ చెక్కలు - 4;
పాలు - అర కప్పు;
అరటిపండు - 1 (చిన్న చిన్న ముక్కలుగా తరగాలి)
తయారుచేసే విధానం :
1. మొదటగా తగినన్ని కూరగాయ ముక్కలను తీసుకుని నీళ్లలో శుభ్రం చేసుకోవాలి. తరువాత వాటిని మంచినీళ్లలో వేసి కొద్దిసేపు వరకు ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తరువాత ఆ వేడి నీటిని పక్కకు తీసుకు పెట్టుకోవాలి.
2. ఒక బాణాలిని తీసుకుని అందులో సరిపడేంత నెయ్యిని పొయ్యాలి. నెయ్యి బాగా కరిగాక అందులో జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు ముక్కలు వేసి, కొద్దిసేపటి వరకు బాగా వేయించుకోవాలి. కాసేపు తరువాత ఇందులో ఉల్లితరుగు వేసి, మళ్లీ వేడి చేసుకోవాలి.
3. మరో మందపాటి గిన్నెలో కొంచెం నెయ్యి వేసి... అందులో ఏలకలు, మిరియాలు, ఇంతకుముందు ఉడికించిన కూరగాయ ముక్కలు, పచ్చిమిర్చి మొదలగు వాటిని వేసి, వేయించాలి. కొన్ని క్షణాల తరువాత అందులో పసుపు, గోధమరవ్వ వేసి... పదినిముషాల వరకు వేడి చేసుకోవాలి.
4. కొన్ని నిముషాల తరువాత ఇంతకుముందు పక్కకు తీసి పెట్టుకున్న కూరగాయలు ఉడికించిన నీళ్లు, ఉప్పు వేసి అరగంట వరకు ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తరువాత ముక్కలను పప్పు గుత్తితో మెదపాలి.
5. అందులో ఇంతకుముందు వేయించి ఉంచుకున్న బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులు, అరటిపండు ముక్కలు, నిమ్మరసం జత చేసుకోవాలి.
6. అందులోలోనే వేయించిన ఉల్లి ముక్కలు, కొత్తిమీర, పుదీనా, నిమ్మచెక్కలతో అలంకరించి వేడివేడిగా అందరికీ సర్వ్ చేసుకోవచ్చు.
మటన్ హలీమ్ :
కావలసిన పదార్థాలు :
బోన్లెస్ మటన్ - కేజీ;
గోధుమరవ్వ - అర కేజీ (నానబెట్టాలి);
శనగపప్పు - అర కేజీ (నానబెట్టాలి);
పెరుగు - ఒకటిన్నర కప్పులు;
అల్లం వెల్లుల్లి ముద్ద - టేబుల్ స్పూను;
ఉల్లి తరుగు - ఒకటిన్నర కప్పులు;
పచ్చి మిర్చి పేస్ట్ - టీ స్పూను;
కొత్తిమీర ముద్ద - 2 టీ స్పూన్లు;
నిమ్మరసం - పావు కప్పు; ఏలకులు - 4;
దాల్చినచెక్క - చిన్న ముక్క;
మిరప్పొడి - టీ స్పూను;
నూనె - అర కప్పు;
ఉప్పు - 2 టీ స్పూన్లు
తయారుచేసే విధానం :
1. ఒక పెద్ద పాత్ర తీసుకుని అందులో పెరుగు, నిమ్మరసం, పచ్చి మిర్చి ముద్ద, కొత్తిమీర ముద్ద, ఏలకులు, దాల్చిన చెక్క, మిరప్పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
2. పైన తయారుచేసుకున్న మిశ్రమాన్ని మటన్ కు పట్టించి, నాలుగు గంటల వరకు ఊరనివ్వాలి.
3. మరొకపాత్రలో తగినన్ని నీళ్లు తీసుకోవాలి. అందులో బాగా నానబెట్టి మెత్తగా చేసుకున్న శనగపప్పు, గోధుమరవ్వ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్టౌ మీద కొద్దిసేపటివరకు మెత్తగా వేయించుకోవాలి.
4. వేడి చేసుకున్న తరువాత దానిని చల్లార్చుకోవాలి. చల్లారిన తరువాత బ్లెండర్ లో వేసి మెత్తగా చేయాలి.
5. ఒక పెద్ద బాణాలి తీసుకుని అందులో కొద్ది నూనె వేసి బాగా కాగబెట్టుకోవాలి. అందులో ఇంతకుముందు ఊరబెట్టి పక్కన వుంచుకున్న మటన్ మిశ్రమాన్ని వేయాలి.
6. స్టౌ మంట బాగా తగ్గించుకుని, మటన్ మిశ్రమంలో తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి, ఉడికించుకోవాలి.
7. బాగా ఉడికించుకున్న తరువాత అందులో ఉడికించి వుంచుకున్న గోధుమరవ్వ మిశ్రమం కలుపుకోవాలి. ఇలా సుమారుగా 20 నిముషాలవరకు ఉడికించుకోవాలి.
8. ఇలా ఉడికించుకున్న తరువాత నిమ్మ చెక్క, కొత్తిమీర, పుదీనా, ఇంతకుముందు వేయించి వుంచుకున్న ఉల్లి తరుగుతో అలంకరించుకోవాలి. ఇలా ఈ విధంగా తయారుచేసుకున్న వేడివేడి మటన్ హలీమ్ ను సర్వ్ చేసుకోవచ్చు.
(ఇదే పద్ధతిలో చికెన్, ఈమూ, ఒంటెల మాంసంతో, చేపలతో కూడి హలీమ్ ను తయారుచేసుకోవచ్చు.)
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more