మన దక్షిణ భారతదేశంలో సాంప్రదాయం, ఆధునికతను వెదజల్లే పురాతనకాలంనాటి సాంస్కృతిక స్థలాలు ఎన్నో వున్నాయి. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో చాలా కొలువై వున్నాయి. అందులో భాగంగానే తిరుచిరాపల్లి నగరం కూడా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. త్రిచీ అనే పేరుగల జిల్లాకు ఇది ప్రధాన కేంద్రంగా గుర్తించబడుతుంది. ఒక పారిశ్రామిక - విద్యాకేంద్రంగా అభివృద్ధి చెందిన ఈ పట్టణం... మొత్తం తమిళనాడు రాష్ట్రంలోనే నాలుగో అతిపెద్ద పురపాలక సంఘంగా పేరొందింది.
ఈ ప్రాంతం పుట్టుకకు సంబంధించి ఎన్నో పురాణకథనాలు గ్రంథాలలో వివరించబడి వున్నాయి. గతంలో ఈ ప్రాంతం పేరు ‘‘త్రిశిరాపురం’’గా వుండేది. సంస్కృతంలో ‘త్రిశిర’ అంటే మూడు తలలు అని అర్థం. కాలక్రమంలో ఈ పదం తిరుచిరాపల్లిగా మారపోయింది. ‘‘త్రిశిరాపురం’’ అనే పేరు రావడానికి ఒక పురాణ కథనం వుంది. కథనం ప్రకారం... పూర్వం ‘‘త్రిశిరుడు’’ అనే మూడు తలలున్న రాక్షసుడు ఈ ప్రాంతంలోనే శివుని అనుగ్రహం కోసం ఘోర తపస్సు చేసి, వరాలు పొందాడు. కాలగమనంలో ఎన్నోసార్లు ఈ ప్రాంతం త్రిశురాపల్లి నుంచి రూపాంతరం చెందుతూ.. చివరికి బ్రిటీష్ హయాంలో త్రిచినోపోలి అనే పిలిచేవారు. దాన్నే సంక్షిప్తంగా త్రిచీ లేదా తిరుచ్చి అని అంటున్నారు.
చరిత్ర : తమిళనాడులోని అతి ప్రాచీనమైన నగరాల్లో ఇది ఒకటి. క్రీ.పూ.2వ శతాబ్దానికి చెందిన జనావాసుల ఆనవాలు ఇక్కడ కనుగొనబడ్డాయి. క్రీ.శ.6వ శతాబ్దంలో ఈ నగరాన్ని పల్లవరాజు అయిన ఒకటవ మహేంద్రవర్మన్ పాలించాడు. అతడు తన హయాంలో రాజ్య అభివృద్ధి కోసం రాక్ ఫోర్ట్ లో చాలా గుహాలయాలను నిర్మించాడు. అతని తరువాత వచ్చిన చోళులు ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుని, క్రీ.శ. 13వ శతాబ్దం వరకు పాలించారు. చోళుల పతనం తరువాత పాండ్యులు ఈ ప్రాంతాన్ని 1216 నుంచి 1311 వరకు పాలించారు. వీరి తరువాత వచ్చిన మదురై సుల్తానులు 1311 నుంచి 1378 వరకు పరిపాలించారు.
ఇలా ఈ విధంగా చాలామంది రాజులు, సామ్రాజ్యాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించాయి. అలా ఆ విధంగా 1736 వరకు మదురై నాయకుల రాజులు పరిపాలించారు. అయితే మదురై నాయకుల రాణి మీనాక్షీ ఆత్మహత్య చేసుకోవడం ద్వారా వారు బలహీనపడిపోయారు. దాంతో ఆ రాజ్యాన్ని చంద్రాసాహిబ్ ఆక్రమించుని 1736 నుంచి 1741 వరకు పాలిస్తాడు. చంద్రాసాహిబ్ ను మరాఠాలు ఓడించి, 1741 నుంచి 1743 వరకు పరిపాలించారు. అయితే ఆ తరువాత ఆ రాజ్యం కర్నాటకలో కలిసిపోయింది. కర్నాటక నవాబును చంద్రాసాహిబ్ 1751లో పదవి నుంచి తొలిగించేశాడు.
అయితే ఒకవైపు బ్రిటీష్ వారు మహమ్మద్ అలీ ఖాన్ వల్లాజా, కర్నాటు నవాబులంతా కలిస్తే... మరోవైపు ఫ్రెంచ్ వారితో చందాసాహిబ్ లు కలిసి రెండు కూటములుగా ఏర్పడుతారు. వీరిద్ధరి మధ్య కర్నాటక యుద్ధం జరిగింది. అయితే ఆ యుద్ధంలో బ్రిటీష్ వారు గెలవగా... ఆ రాజ్యాన్నివారు మహమ్మద్ అలీ ఖాన్ వల్లాజాకు అప్పజెప్పారు. తిరిగి 1801లో బ్రిటీష్ వారు ఆ రాజ్యాన్ని చేజిక్కుంచుకుని, కర్నాటక నుంచి మద్రాస్ ప్రెసిడెన్సీలో కలిపారు. ఆ విధంగా కలిపిన తరువాత బ్రిటీష్ హయాంలోనే ప్రముఖ ప్రసిద్ధ నగరంగా అభివృద్ధి చెందింది.
ఆకర్షణీయమైన ప్రదేశాలు :
1. జంబు లింగేశ్వర, అఖిలాండేశ్వరి టెంపుల్ : ఈ దేవాలయాన్ని చోళరాజులలో మొదటి వాడయిన కోచెంగా చోళ నిర్మించాడు. ఇది కనీసం 1800 ఏళ్లనాటిదని నిపుణులు అక్కడ లభించిన శిలాశాసనాల ద్వారా తెలిపారు. అయినప్పటికీ ఇది చెక్కుచెదరకుండా ఇప్పిటికీ చాలా మంచి స్థితిలో వుందని అంటున్నారు. ఈ ఆలయంలో ఒక విశిష్టమైన ప్రత్యేకత వుంది. జంబు కేశ్వర లింగం కింద నీరు ఎల్లప్పుడూ నిల్వ వుంటాయి. ఒకవేళ ఆ నీటిని అక్కడి నుంచి తొలగించినా... తిరిగి ఆ స్థలంలో నీరు చేరిపోతాయి. ఈ ఆలయానికి సంబంధించిన ఒక పురాణ కథ కూడా వుంది. కథనం ప్రకారం... శివుడు తపస్సు చేసుకుంటుండగా పార్వతి అతనిని భంగపరుస్తుంది. దీంతో కోపగించుకున్న శివుడు ఆమెను భూమి మీద వెళ్లి తపస్సు చేసుకోవాల్సిందిగా ఆదేశిస్తాడు. దాంతో ఆమె భూమిపై అఖిలాండేశ్వరిగా అవతరించి, జంబు అడవిలో తపస్సు మొదలు పెడుతుంది. అక్కడి కావేరి నది నీటితో ఒక శివలింగాన్ని తయారు చేసుకుని పూజలు నిర్వహించుకునేదని పురాణకథనం. పార్వతి తపస్సు చేసిన స్థలంలోనే ఈ ఆలయం నిర్మితమై వుంది.
2. శ్రీ రంగనాథ స్వామి దేవాలయం : విష్ణువు ప్రధాన దైవంగా నిర్మించిన 108 దివ్య దేశాల్లో ఈ దేవాలయం మొదటిది. ఇందులో విష్ణువు శేషతల్పసాయిగా వుండే మూలవిరాట్టుతో రంగనాథవతారంగా పూజలు అందుకుంటాడు. ద్రావిడ నిర్మాణ శైలిలో వుండే ఈ గుడి గురించి ఆళ్వార్లు రచించిన దివ్య ప్రబంధంలో ఎన్నోసార్లు ప్రస్తావించారు. ఈ దేవాలయం చాలాసార్లు డచ్చి, పోర్చుగీస్, ఇంగ్లీష్ వారి దాడులను తట్టుకుని నేటికి స్థిరంగా నిలబడిపోయింది. దక్షిణ భారతంలోని వున్న సుప్రసిద్ధ వైష్ణ దేవాలయాల్లో ఈ గుడి ఎంతో ప్రముఖమైంది.
3. గుణశీలం విష్ణు ఆలయం : కావేరి నది ఒడ్డున వుండే ఈ ఆలయం... విష్ణుమూర్తికి చెందింది. మానసిక వికలాంగులను ఈ ఆలయంలో 48 రోజులవరకు వదిలేస్తే వారు త్వరగా నయం పొందుతారని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తారు. ఈ ఆలయ ప్రధాన దేవత ప్రసన్న వెంకటాచలపతి. విఖానసర్ సన్నిధి ఈ ఆలయం ప్రాంగణంలో కనిపిస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలో బ్రాహ్మణుడైన విఖానసర్ ని వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించాడని పురాణాలలో పేర్కొనబడింది.
4. సెయింట్ జోసెఫ్ చర్చి : త్రిచీలో నిర్మించిన ప్రసిద్ధ చర్చీల్లో ఈ చర్చి ఒకటి. 1792లో నిర్మించిన ఈ చర్చీ... భారతదేశంలో వున్న అతి పురాతనమైన వాటిలో ఒకటి. బ్రిటీష్ వారి ఆర్థిక సహాయంతో స్వ్కార్ట్జ్ దీన్ని నిర్మించాడు. నగరం మధ్యన వున్న తెప్పకులం దగ్గర ఈ చర్చి వుంటుంది. ఈ చర్చి ద్వారా క్రైస్తవ మత ప్రచారాలు మొదలయ్యాయి.
5. ముక్కొంబు ఆనకట్ట : ఈ డ్యాం నగరానికి కేవలం 18 కిలోమీటర్ల దూరంలోనే వుండటం వల్ల ఇది ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మారిపోయింది. కావేరి, కొల్లాడం నదులపై దీనిని నిర్మించారు. ఈ డ్యాంకు దగ్గరలోనే పిల్లల పార్కులు, అమ్యూజ్మెంట్ పార్కు, ఫిషింగ్ వంటి క్రీడలు ఎంతో ఆకర్షణీయంగా దర్శనమిస్తాయి. ఈ డ్యాం వల్లే ఆ ప్రాంతమంతా ఒఖ ప్రసిద్ధ విహారకేంద్రంగా పిలువబడుతుంది.
6. కళ్లనై డ్యాం : కావేరి నది మీద నిర్మించిన ఈ డ్యాంను ‘‘గ్రాండ్ ఆనికట్’’ అని పిలుస్తారు. దీనిని చోళరాజు కరికాలన్ 1వ శతాబ్దంలో నిర్మించాడు. దీనిని ప్రపంచంలోనే అతి పురాతనమైన నీటి యాజమన్య సంస్థగా పరిగణిస్తారు. ఈ డ్యాం 329 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్ప వుంటుంది. ఈ డ్యాంను నిర్మించడానికి వాడిన శిలల ఆధారంగా దీనికి కళ్లనై డ్యాం అని పేరొచ్చింది.
AS
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more