భారత కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-16 ప్రయోగం ఎట్టకేలకు దిగ్విజయంగా జరిగింది. ప్రతికూల వాతావరణం కారణంగా గత రెండు రోజులుగా ఈ ప్రయోగం వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక 2.10 గంటలకు ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్-5 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరిగింది. జీశాట్-16తోపాటు ఎస్ఎస్ఎల్ సంస్థ నిర్మించిన డైరెక్ట్ టీవీ-14 ఉపగ్రహాన్ని కూడా ఈ రాకెట్ ద్వారా కక్ష్యలోకి పంపారు. అమెరికా వ్యాప్తంగా డీటీహెచ్ ప్రసారాలను అందించడానికి డైరెక్ట్ టీవీ సంస్థ దీన్ని ఉపయోగించుకోనుంది.
జీశాట్-16 వల్ల భారత్లో కమ్యూనికేషన్ సేవలకు వూతం లభిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు టీవీ, రేడియో సేవలు మరింత మెరుగుపడనున్నాయి. ఇంటర్నెట్, టెలిఫోన్ కార్యకలాపాలకు ప్రయోజనం కలుగుతుంది. ఈ ఉపగ్రహం 12 ఏళ్ల పాటుసేవలు అందిస్తుంది. ఏప్రిల్లో అర్ధాంతరంగా ఆగిపోయిన ఇన్శాట్-3ఇ స్థానాన్ని ఇది భర్తీ చేస్తుంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more