తెలంగాణ ఐటీశాఖ మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు.. తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకుని ప్రతీ పనిలో తనదైన ముద్ర వేసుకుంటూ.. తండ్రికి తగ్గ తనయుడిగా కన్నా తండ్రిని మించిన తనయుడిగా తెలంగాణ వ్యాప్తంగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని తన మంత్రిత్వశాఖ వ్యవహరాలతో పాటు పార్టీ వ్యవహారాలలో కూడా తన మార్కును వేసుకుంటున్నారు. ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటుగా బాధ్యతలు చేపట్టినా.. పూర్తి స్థాయిలో పార్టీకి తన సేవలుఅందిస్తున్నారు. ఈ తరుణంలో గత ఏడాది క్రితం కాబోయే ముఖ్యమంత్రి అంటూ కూడా వార్తలు వచ్చాయి.
ఉద్యమ నేపథ్యంలో పార్టీలో చేరిన కేటీఆర్.. అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రిగా కూడా తన సేవలను రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారు. ప్రతీ సమస్యపై తనదైన శైలిలో స్పందిస్తూ వెనువెంటనే ప్రతిస్పందిస్తుంటారు. అలాంటి కేసీఆర్ ఇటీవల సైదాబాద్ లోని సింగరేణి కాలనీలోని అరేళ్ల బాలిక అత్యాచారం, హత్య విషయంలో మాత్రం కాసింత తొందరపడ్డారు. ఈ హత్యకేసులో నిందితుడిని పోలీసులు గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. అయితే ఆ తరువాత హత్యాచార కేసులో నిందితుడ్ని ఆచూకీ చెప్పినవారికి భారి బహుమతి అందిస్తామని పోలీసులు ప్రకటించారు.
దీంతో తన తప్పిదాన్ని తెలుసుకున్న కేటీఆర్ వెంటనే అదే ట్విట్టర్ ఫ్లాట్ ఫామ్ పై తనకు తన సిబ్బంది నుంచి తప్పుడు సమాచారం అందిందని, దాంతోనే తాను నిందితుడు పట్టుబడ్డాడని భావించానని చెప్పుకోచ్చారు. జరిగిన పోరబాటుని అంగీకరించడం కూడా గొప్పదనమే కదా. ఇదంతా జరిగిపోయిన స్టోరి.. తాజా మ్యాటర్ ఏంటంటే.. మరోసారి కూడా అలాంటి తప్పిందమే జరిగిందా.? లేక కావాలనే ఇలాంటి పోరబాటు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ హ్యాండర్ ద్వారా జరిగిందా.? అన్నది అర్థంకాని ప్రశ్న. ఈ నెల 22న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో ఓ పోస్టు చేశారు.
ఈ నెల 22న సరిగ్గా ఉదయం 11.05 నిమిషాలకు చేసిన ఈ పోస్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వైద్యారోగ్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు ఎంతటి అకుంటిత భావంతో విధులు నిర్వహిస్తున్నారో అంటూ ఆ ఫోటోలు తన ఫాలోవర్లతో పంచుకున్నారు. ఈ ఫోటోలలో విజయనగరం జిల్లాలో కొందరు వైద్యఆరోగ్య సిబ్బంది ఓ పెద్దవయస్సులో ఉన్న రైతుకు కరోనా టీకాఇస్తున్నారు. అదే పోస్టులో మరో ఫోటోలో ప్రకాశం జిల్లాలోనూ పోలాల్లో పనిచేస్తున్న మహిళలకు అరోగ్య సిబ్బంది టీకాలు వేస్తున్నారు. ఇక విశాఖపట్నం జిల్లాలో మాన్యంలో ఓ మహిళా ఏఎన్ఎం ఎంతో ధైర్యంతో నడుములోతు నీరు ప్రవహిస్తున్న వాగును దాటి పోర్లుబంద గ్రామానికి వెళ్లి టీకాలను వేసిందని పేర్కోన్నారు.
అయితే వీటిలోని విజయనగరం, ప్రకాశం జిల్లాలోని ఫోటోలను ఖమ్మం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఫోటోలుగా పేర్కోంటూ.. కేటీఆర్ ఈనెల 24న ఉదయం 9.01 నిమిషాలకు వాటినే పోస్టు చేశారు. అయితే విజయసాయి తన వైద్యఅరోగ్యసిబ్బంది అంకితభావాన్ని చాటుతూ తెలుగులో పోస్టు పెట్టగా, కేటీఆర్ మాత్రం తమ అరోగ్య కార్యకర్తలు అకుంటిత భావాన్ని తెలుపుతూ ఆంగ్లంలో పోస్టు పెట్టారు. దీంతో టీకా తీసుకుంటున్న వ్యక్తులు వారే.. అరోగ్య సిబ్బంది వారే.. ఫోటోలు అవే కావడంతో ఇంతకీ ఈ వైద్యఆరోగ్య సిబ్బంది ఏ రాష్ట్రవాసులని నెటిజనులకు ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్ పై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉద్యోగులందరిలో స్ఫూర్తి నింపుతున్నారు. వైద్యారోగ్య సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ఉద్యమంలా సాగుతోంది. pic.twitter.com/eLCqT2oSQ6
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 22, 2021
తెలుగురాష్ట్రాలు, తెలుగు ప్రజలు ఒక్కటేనని చాటడానికి ఈ కరోనా వాక్సీన్ టీకాల ఫోటోలనే కొందరు ఉదహరిస్తున్నారు. మరికోందరు మాత్రం రాష్ట్రాలు విడిపోయిన విషయాన్ని ఈ నేతలు మర్చిపోయారా.? లేక ప్రజలను మధ్యపెట్టడానికి ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారా.? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకోందరు మాత్రం ఈ వైద్యారోగ్య సిబ్బంది, టీకాలు తీసుకన్న వ్యక్తులు అసలు తెలుగు రాష్ట్రాలకు చెందినవారేనా.? అంటూ వ్యంగంగా ప్రశ్నలను సందిస్తున్నారు. ఇక రాష్ట్రాలు విడిపోవాలని, మా నీళ్లు, మా నిధులు, మా ఉద్యోగాలు, మా వనరులు మాకే అంటూ ఉద్యమాలు చేసినా.. ఇప్పుడు మాత్రం ఎవరి ఫోటోను ఎవరు పంచుకుంటున్నారని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి ఇది కూడా తప్పుడు సమాచారమేనని మంత్రివర్యులు అంగీకరిస్తారేమో వేచి చూడాలిమరి.
Two pics; one from Khammam District & the other from Rajanna Siricilla district
Whats common to both pictures is the commitment level of our healthcare workers
And the farm revolution ushered in Telangana under the able leadership of Hon’ble KCR Garu
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more