కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిందన్నట్లుంది కేంద్ర ప్రభుత్వం తీరు. చలామణీలో ఉన్న నకిలీ నోట్లను కట్టడి చేయడానికి యావత్ దేశ ప్రజలను నిద్రాహారాలు దూరం చేసి.. డ్యూటీలు, అఫీసులు, పనులు, వ్యాపారాలకు కూడా స్వస్తి పలికి ఏకంగా ఆరు నెలల పాటు నోటు కోసం అల్లాడిపోయేలా చేసింది. 2016 నవంబర్ 8కి ముందున్న పెద్ద నోట్లు రూ.500, రూ.1000ని రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రూ.500 నోటును తీసుకువచ్చింది. అంతటితో ఆగకుండా పెద్దనోటు అని రద్దు చేసిన రూ.1000 నోటు స్థానంలో రూ.2000 నోటును కూడా తీసుకువచ్చింది.
దీంతో బడాబాబులకు లబ్ది చేకూరిందే కానీ పేదలకు మాత్రం ప్రయోజనం లభించలేదు. ఎందుకంటే పేదలు వారి నిత్యావసరాల కోసం ప్రతీ రూపాయిని ఖర్చు పెడుతుంటారే తప్ప.. మిగుల్చుకునే వారి సంఖ్య అత్యంత తక్కువనే చెప్పాలి. ఇక ఈ నోట్లును ప్రవేశపెట్టిన నేపథ్యంలో దానిని కేవలం ప్రస్తుతానికి చెలామణిలోకి తెచ్చారని, త్వరలోనే దానిని రద్దు చేస్తారన్న వార్తలను కూడా సృష్టించారు. దీంతో ఈ నోటును తమ వద్ద భద్రపర్చుకోవడం కంటే ఖర్చు పెట్టడమే సముచితం అని బావించిన పేద, మధ్యతరగతి వర్గాలు ఎటూ తేలని డోలాయమాన పరిస్థితుల్లో దానిని భద్రపర్చుకోవడంలో అభద్రతతా భావాన్ని కనబర్చారు. దేశ ప్రజల్లో ఈ మీమాంస దాదాపు రెండేళ్ల వరకు కొనసాగింది. ఈ విషయమై పార్లమెంటులోనూ ఎంపీలు పలుమార్లు ప్రశ్నించారు.
ఇక కొత్త పెద్ద నోట్లను ప్రవేశ పెడుతున్న సమయంలో కేంద్రంలోని పెద్దలు త్వరలోనే తాము ప్రవేశ పెడుతున్న నోట్లకు నకిలీ నోట్లు రావని.. వీటిని పాకిస్తాన్ సహ ఏ దేశం కూడా ముద్రించలేదని ఘంటాపథంగా చెప్పారు. కానీ ప్రస్తుతం పరిస్థితిలో మార్పు వచ్చింది. మాట మాట్లాడితే గత 70 ఏళ్ల కాలంలో అనే కేంద్ర ప్రభుత్వ పెద్దలు.. గత 70 ఏళ్లలో ఎంత మేర నకిలీ నోట్లు చెలామణిలో వున్నాయో.. 2016 నవంబర్ 8 తరువాత వినియోగంలోకి వచ్చిన కొత్త నోట్లు ఎంత మేర నకిలీ నోట్లు వున్నాయో అర్థం చేసుకోవాల్సిన అవసరం వుంది. తాజాగా భారతీయ రిజర్వు బ్యాంకు వెల్లడించిన వివరాలు అందోళనకరంగా వుంది.
మన దేశంలో ఫేక్ కరెన్సీ విచ్చలవిడిగా చలామణి అవుతోంది. ఈ పరిస్థితిపై రిజర్వ్ బ్యాంకు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తన తాజా నివేదికలో ఆర్బీఐ కీలక విషయాలను వెల్లడించింది. మన వ్యవస్థలో దొంగనోట్లు పెరిగిపోతున్నాయని నివేదికలో ఆర్బీఐ పేర్కొంది. ముఖ్యంగా రూ. 500 డినామినేషన్ నోట్లు విపరీతంగా చలామణి అవుతున్నాయని తెలిపింది. రూ. 500 ఫేక్ కరెన్సీ ఏకంగా 31.4 శాతం మేర పెరిగిందని చెప్పింది. అయితే ఇతర డినామినేషన్ నోట్ల ఫేక్ కరెన్సీ మాత్రం తగ్గిందని తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 39,453 ఫేక్ రూ. 500 నోట్లను ఆర్బీఐ గుర్తించింది.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more