బెజవాడ వైసీపీలో అసమ్మతి సెగ రాసుకుంది. విజయవాడ సెంట్రల్ సీటును కాంగ్రెస్ నుంచి వలసవెళ్లిన వెసీపీ నేత మల్లాది విష్ణుకు కేటాయించేందుకు ఆ పార్టీ అధిష్టానం సంకేతాలను జారీ చేసిన నేపథ్యంలో ఇక ఆ పార్టీలో మనజాలలేనని భావిస్తున్న వైసీపీ నేత వంగవీటి రాధా వర్గీయులు త్వరలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు చెందిన పార్టీ జనసేన తీర్థం తీసుకోనున్నారా.? అంటే ప్రస్తుత పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి. త్వరలోనే ఆయన జనసేనలో చేరనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
విజయవాడ సెంట్రల్ సీటుపైనే ఆశలు పెట్టుకుని వేచిచూస్తున్న వంగవీటి రాధాను కాదని మల్లాధి విష్ణుకు బాద్యతలను అప్పగించిన తరుణంలో క్రితం రోజున ఆయన అనుచరులు, పార్టీ పదవులకు రాజీనామా చేశారు. విజయవాడలో జరిగిన పార్టీ సమావేశంలో ఈ మేరకు సంకేతాలు వెలువడిన క్రమంలో ఆ సమావేశం నుంచి రాధా మధ్యలోనే వెళ్లిపోగా, విషయం తెలుసుకున్న కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సోమవారం ఆయన నివాసానికి చేరుకుని హల్ చల్ చేశారు. పార్టీలో చేరినప్పటి నుంచి ఆ సీటు నుంచే బరిలోకి దిగాలని రాధా భావిస్తుంటే.. విష్ణుకు పగ్గాలు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు.
వైసీపీ అధినేత జగన్ తీరుపై రాధా వర్గీయులు మండిపడుతున్నారు. పార్టీని, నమ్ముకుని వస్తే నట్టేట ముంచుతారా అంటూ.. ఇదేనా నీతి, నిజాయితీ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో నిరసనలు, రాజీనామాలతో పార్టీ ఉనికిని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే.. మీకే నష్టమని కూడా వంగవీటి రాధాకు వైసీపీ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. అయినా రాధా అనుచరులు వెనక్కు తగ్గడం లేదు. రాధా సోదరుడు, ఉయ్యూరు కౌన్సిల్, జిల్లా ఫ్లోర్ లీడర్ వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్ వైసీపీకి రాజీనామా చేశారు. మరికొందరు కూడా పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
దీంతో ఇక వైసీపీ అధిష్టానం కూడా అంతే పట్టుదలతో వ్యవహరించడం మొదలుపెట్టింది. సెంట్రల్ సీటు విషయంలో వైసీపీ, వంగవీటి కుటుంబాల మధ్య సయోధ్య కుదరడం లేదు. సెంట్రల్ సీటు విషయంలో ప్రతిపక్ష వైసీపీ అధిష్టానం వెనక్కి తగ్గడం లేదు. బెజవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయ కర్తగా పార్టీ బాధ్యతలను మల్లాది విష్ణుకు అప్పజెప్పడానికే సుముఖత వ్యక్తం చేస్తుంది. దీంతో వంగవీటి రాదా వర్గం వైసీపీకి షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకోనుంది.
ఇప్పటికే రంగారాధా మిత్రమండలికి చెందిన కార్యకర్తలను సమన్వయపర్చిన రాధా అనుచరులు వారితో రాధా భవిష్యత్తు నిర్ణయాన్ని చర్చించే పనిలో పడింది. ఈ క్రమంలో టీడీపీ కూడా ఆయనను పార్టీలోకి లాగేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా.. సెంట్రల్ సీటుపై మాత్రం హామీ ఇచ్చేందుకు వెనకాడుతుంది. అయితే విజయవాడలో అత్యంత ప్రేక్షకాధరణ, కార్యకర్తల ఫాలోయింగ్ వున్న పవన్ కల్యాన్ పార్టీలో చేరాలని కొందరు అనుచరులు సూచిస్తున్నారని సమాచారం.
జనసేనలో చేరితే తమకు కలసి వస్తుందని, ఆ పార్టీ నుంచి సెంట్రల్ సీటు కూడా హామీ లభిస్తుందని కొందరు రాధా అనుచరులు ఆయనకు సూచిస్తున్నాట్లు సమాచారం. విజయవాడ సెంట్రల్ సీటు కోసం వేచిచూస్తున్న తనను కాదని ఇతరులకు సీటును కేటాయిస్తే.. తమ ఆత్మగౌరవం దెబ్బతినిందని అందుకనే పార్టీని వీడి వెళ్తున్నామన్న సంకేతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి.. తరువాత జనసేనలోకి చేరుదామన్న రాధా అనుచరులు భావిస్తున్నారని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more