రాజ్యసభలో ఖాళీ స్థానాలకు సంబంధించి సమీకరణాలు ఏ క్షణంలో ఎలా మారిపోతున్నాయో అర్థం కావటంలేదు. ఎప్పటికప్పుడు సీట్ల కేటాయింపులో మార్పులు చేస్తూ బీజేపీ, తెదేపాలు ఎత్తులు వేస్తున్నాయి. రెండు పార్టీల మొదటి జాబితాలను నిశీతంగా గమనిస్తే ఈ విషయం అర్థమైపోతుంది. కీలక నేతల సీట్ల కేటాయింపులో వారు అనుసరించే వ్యూహాన్ని బట్టి అంచానాలకు అందకుండా వారు ముందుకు వెళ్తున్నారు. అయితే అవసరమైన దానికంటే ఎక్కువగా ఈ విషయంలో వదంతులు సృష్టిస్తూ ఓ మైండ్ గేమ్ ఆడుతున్నాయి.
అసలు విషయానికొస్తే... ఒకప్పుడు ఆరెస్సెస్ లో కీలక నేతగా రాంమాధవ్ ఏడాదిన్నర క్రితం బీజేపీ నేతగా మారిపోయాడు. అప్పటి నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో రాంమాధవ్ సత్తా చాటుతున్నారు. దీంతో ఆయనను రాజ్యసభకు పంపాలని బీజేపీ దాదాపుగా నిర్ణయించిందని, ఈ క్రమంలో ఆయన్ను ఏపీ కోటా నుంచే పెద్దల సభకు పంపాలని నిర్ణయించిందని వార్తలు వచ్చాయి. ఈ ప్రతిపాదనకు మిత్రపక్షం టీడీపీ కూడా ఒకే చెప్పినట్లు కొన్ని వర్గాలు ప్రచారం చేశాయి. తెలంగాణలో మొండిచేయి ఇచ్చి ఏపీలో అంతంత మాత్రం ప్రభావం ఉన్న బీజేపీ నేతకు (అఫ్ కోర్స్ ఇక్కడా అదే పరిస్థితి అనుకోండి) సీటు కేటాయించడం దారుణమని తెలంగాణ తమ్ముళ్లంతా గగ్గోలు పెట్టడం ప్రారంభించారు. కానీ, అదంతా అవాస్తవమని స్వయంగా రాంమాధవ్ చెప్పాల్సిన పరిస్థితి దాపురించింది. సోమవారం ఉదయం ట్విట్టర్ లో ప్రత్యక్షమయిన ఆయన ఏపీ కోటాలో నుంచి తాను రాజ్యసభ బరిలోకి దిగుతున్నట్లు వస్తున్న వార్తలన్నీ తప్పని ట్వీటారు. మరో సీనియర్ టీజీ వెంకటేష్ కూడా సోమవారం ఉదయం చంద్రబాబును కలవటంతో ఆయన పేరు కూడా దాదాపు ఖరారయ్యిందని వార్తలు వస్తున్నాయి. అయితే వీటిలో ఏది నిజం లేదని పార్టీ ఖండించింది.
దీంతో టీటీడీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ ఇక్కడ కాకపోయినా కనీసం ఏపీ కోటాలో ఉన్న సీట్లలో ఒక్కదానైనా ఇవ్వాలని మోత్కుపల్లి నేరుగానే విజ్నప్తి చేశారు కూడా. దానికి తోడు మారిన పరిస్థితులు టీడీపీతో పాటు మరోవైపు బీజేపీ నేతల్లో ఆశలు చిగురింపజేస్తున్నాయి. టీడీపీ కోటాలో ఎంపీగా ఉన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కర్ణాటక కోటా నుంచి బరిలోకి దిగుతున్నారు. మరో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అంతా అనుకున్నట్లు కర్ణాటక నుంచి కాకుండా రాజస్థాన్ నుంచి దింపుతున్నట్లు అల్రెడీ ప్రకటించేసింది. ఆయా సీట్లపై ఇప్పుడు క్లారిటీ రావటంతో పార్టీ పెద్దలను కలిసేందుకు నేతలు క్యూ కడుతున్నారు. అమరావతిలో ఇప్పటికే పాగా వేసిన ఏపీ సీఎం చంద్రబాబు ఈ విషయంలో సీనియర్లతో మంతనాలు చేస్తున్నారు. బీజేపీకి సీటు కేటాయించాలా లేక తమ అభ్యర్థులనే నిలబెట్టాలా? తెలంగాణ నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలా అంటూ మల్లగుల్లాలు పడుతున్నారు. ఓవైపు టీ తమ్ముళ్లలో నెలకొన్న అసంతృప్తిని తొలగించడంతోపాటు, బీజేపీ మిత్ర భాగస్వామ్యం చెడగొట్టుకోవద్దన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై ఇప్పటిదాకా మెయింటెన్ చేసిన సస్పెన్స్ కు కాసేపట్లో తెరపడి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more