2004 సంవత్సరంలో సునామీ దెబ్బ గురించి దేశం ప్రజలకు బాగా తెలుసు. ఇప్పటికి ఆ సునామీ దెబ్బ ఎవరు మరిచిపోలేదు. మళ్లీ అలాంటి సునామీ దెబ్బ 2014లో కనిపిస్తుంది. అంటే దేశంలో జరుగుతున్న ఎన్నికలు. అయితే ఈ సారి జరిగే ఎన్నికలు .. 2004 లో వచ్చిన సునామీని గుర్తు చేస్తున్నాయి. అవినీతి రాజయకీ నేతలతో అల్లాడిపోతున్న దేశం ప్రజలే, రాజకీయ పార్టీలకు సునామీ దెబ్బ రుచి చూపిస్తున్నారు.
పదేళ్లు పాటు.. అవినీతి పాలన నలిగిపోయిన ప్రజలు విముక్తి కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పాలనపై దేశ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆంద్రప్రదేశ్ లోని తెలుగు ప్రజులు. కాంగ్రెస్ కుట్ర రాజకీయలతో.. ఆంద్రప్రదేశ్ ను రెండు విడదీసిన విషయం తెలిసిందే. కలిసిమెలిసి ఉన్న తెలుగు వారిని రెండు ప్రాంతాల ప్రజలుగా విడగొట్టి, వారి మద్య రాజకీయ విద్వేషం నింపి, రాజకీయ ఎన్నికలకు తెరలేపింది.
ఇలాంటి సమయంలో.. కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు, తెలుగు ప్రజల జీవితాలతో, భవిష్యత్తుతో ఆటలాడం మొదలుపెట్టారు. తెలుగు ప్రజలు ఆర్తనాధాలు .. పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ, ‘‘ఒక కంటిలో బెల్లం, మరో కంటిలో సున్నం’’ అన్నట్లు సవతి తల్లి ప్రేమ ఎలా ఉంటుందో.. తెలుగు ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించిన ఘనత ఒక్క సోనియా గాంధీకే దక్కిందని రాజకీయ మేథావులు అంటున్నారు.
తెలుగు ప్రజలు దిక్కులేని వారిగా.. ఆదుకొని ఆపద్భందువు కోసం ఎదురు చూస్తున్న సమయంలో ‘‘జనం కోసం పుట్టిన ‘‘జనసేనపార్టీ ’’ తెరపైకి వచ్చింది. ఎడారిలో నిలబడిని రెండు ప్రాంతాల ప్రజల కోసం నేనున్నా అంటూ .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుకు రావటం జరిగింది. దీంతో తెలుగు ప్రజలు ఆనందంతో పొంగిపోయారు. కొంతమంది నోటి దూల నేతలు.. నోరు జారిన విషయం తెలిసిందే.
అయితే అన్నింటికి అణిగిమణిగి ముందుకు పోవటమే ద్వేయంగా పెట్టుకున్నా పవన్ కళ్యాణ్. నోటి దూల నాయకులకు పొలిటికల్ పంచ్ ఇస్తూనే, తెలుగు ప్రజల గుండెల్లో సంపూర్ణ దైర్యం నింపిన ఏకైక వ్యక్తి ఒకే ఒక్క పవన్ కళ్యాణ్ సీనియర్ రాజకీయ మేథావులు అంటున్నారు. ఆయనలోని ఆవేశం, గుండె తెగువ, ప్రతి ఒక్కరికి సాయం చెయ్యలనే తపనే తెలుగు ప్రజలకు బాగా నచ్చింది. కానీ కొన్ని రాజకీయ పార్టీలకు, నేతలకు పవన్ పొలిటికల్ ఎంట్రీ నచ్చలేదనే విషయాన్ని వారు బయటకు చెప్పటం జరిగింది. ఎలాగైన పవన్ పై రాజకీయ బురద చల్లాలి అనే కుట్రతో.. ఆయన వ్యక్తిగత విషయల్లోకి తొంగిచూడటం జరిగింది. కానీ చివరకు వారు సాధించింది ఏమీ లేదని అందరికి అర్థమైంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికి, రాజకీయ పార్టీలకు, నేతలకు పవన్ సునామీ దెబ్బ రుచి చూపించాడని రాజకీయ మేథావులు అంటున్నారు. అందరి రాజకీయ నేతల మాదిరి అర్థరాత్రి హామీలు, ‘‘నన్ను ముఖ్యమంత్రిని చెయ్యండి? మీకు ఐదు సంతకాలు చేస్తాను’’, అని తెలుగు ప్రజలను నాలుగు సంవత్సాల నుండి ఓదార్చుస్తున్న నేతలాగా కాకుండా.. పవన్ సరికొత్త గా ‘‘మీకు అండగా నేను ఉంటా’’? మీ కోసం నేను ప్రాణాలు ఇవ్వటానికైన సిద్దమే అని ప్రజల ముందు గర్వంగా చెప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక్కరే.
ఆయన అలా చెబుతున్నాడు.. ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు, నేతలకు గుండె జారీ పోయింది. ఆ సమయంలో తెలుగు ప్రజలకు పవన్, ఒక అల్లూరి సీతారామారాజు, టంగుటూరి ప్రకాశం పంతులు లాంటి మహానీయులు స్పష్టం గా కనిపించారనటంలో ఎలాంటి సందేహం లేదని చదువుకున్నతెలుగుప్రజలు అంటున్నారు.
పవన్ ఎన్నికల్లో పోటీ చేయకపోయిన.. తన పూర్తి మద్దతు తెలుగు ప్రజలకు మేలు చేసే రాజకీయ పార్టీలకు ఇవ్వటం జరిగింది. ఆయా పార్టీల గెలుపు కోసం.. ఎండలో ఎండుతూ, వానాలో తడుస్తూ, ఒక సామాన్య వ్యక్తిగా ప్రజల మద్య ఎన్నికల ప్రజల సాగించిన విషయం తెలిసిందే. జనసేన పార్టీ పుట్టిన అతి తక్కువ సమయంలో జాతీయ నేతల పక్కన చోటు సంపాదించుకున్న ఘనత ఆ పార్టీ అధినేతకే దక్కింది. ఎలాంటి కుట్రపూరిత రాజకీయలు చేయకుండానే తెలుగు ప్రజల మనసు గెలుచుకున్న రాజకీయ నేత పవన్ కళ్యాణ్ ఒక్కరే.
జనసేన పార్టీ అధినేత గా రెండు ప్రాంతాల ప్రజలకు మంచి నాయకుడ్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంలోనే.. రాజకీయ నేతల చీకటి రహస్యలను పవన్ బయట పెట్టడం జరిగింది. తెలంగాణలో, సీమాంద్ర లో పవన్ పవనాలు బాగా వీచిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రెండు ప్రాంతాల రాజకీయ నేతలు.. పవన్ లెక్క ఏమిటో తెలిసే సమయం ఆసన్నమైందని అంటున్నారు. తెలుగు దేశం పార్టీ, బిజేపి పార్టీల నాయకులు పవన్ కళ్యాణ్ ప్రచారం మాకు ‘‘శ్రీరామ రక్ష’’అని అంటున్నారు.
ఇక పది సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా నలిగిపోయిన .. నారా చంద్రబాబు నాయడు.. జనసేన పార్టీ పవన్ పై నమ్మకం పెట్టున్నారు. పవన్ లెక్కతో.. మరికొన్ని గంటల్లో కొన్ని రాజకీయ పార్టీలకు శుభం కార్డు పడుతుందని రాజకీయ మేథావులు అంటున్నారు. ఇప్పటికే కొంతమంది నేతలు పవన్ తో మంతానలు జరుపుతున్నట్లు సమాచారం.
పవన్ కళ్యాన్ లెక్క ఎప్పుడు తప్పదని .. ఆయన ఆరడుగుల బుల్లెట్ అని, ఈ బుల్లెట్ దెబ్బకు అవినీతి రాజకీయ పార్టీలు, నేతలు.. పెట్టబేడా సర్థుకోవాల్సిందేనని జనసేన పార్టీ అభిమానులు అంటున్నారు. 2014లో పవన్ సునామీ దెబ్బకు.. జాతీయ పార్టీ 120 సంవత్సరాలు చరిత్రకలిగిన పార్టీ, తలపండిన సినీయర్ రాజకీయ నేతలకు.. విశ్రాంతి కలిగే సమయం ఆసన్నమవుతుందని తెలుగు ప్రజలు అంటున్నారు.
పవన్ కు తిక్కుందని, దానికి లెక్క లేదని కొంతమంది రాజకీయ నేతలు చెప్పటం జరిగింది. మరికొన్ని గంటల్లో .. పవన్ కు తిక్కే కాదు.. లెక్క కూడా ఉందనే విషయం అందరికి తెలుస్తోందని.. ఆయన అభిమానులు అంటున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more