ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను మేం ఒప్పుకోము అని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.
దేశంలో వోటర్లున్నది 80కోట్ల సంఖ్యలోనయితే కేవలం లక్షమంది దగ్గర తీసుకున్న అభిప్రాయం సరైనది ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వాటిని లెక్కలోకి తీసుకోమని, కేవలం మే 16 న వచ్చే ఫలితాల కోసమే ఎదురు చూస్తున్నామంటూ కాంగ్రెస్ పార్టీ ఛీఫ్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్లో తెలియజేసారు.
2004 లోను 2009 లోను ఇలాగే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఎగ్జిట్ పోల్స్ ని ప్రచారం చేసారు కాని ఏమైంది అన్నారు పార్టీ కార్యదర్శి షకీల్ అహ్మద్.
అసలు ఎగ్జిట్ పోల్స్ అనేవి టైం పాస్ వ్యవహారమంటున్నారు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. మే 16 న వచ్చే ఫలితాలే తప్ప మిగతావి ఏమీ నమ్మదగ్గవి కావని ఆయన అంటున్నారు. భాజపాకి తిరుగులేని విజయం లభిస్తుందని చెప్తున్న ఒక టివి ఛానెల్ విశ్వసనీయతను ఆయన ప్రశ్నించారు. రాజస్థాన్ ల కాంగ్రెస్ కి కేవలం 2 స్థానాలే వస్తాయని ఒక ఛానెల్ అంటే, కాదు 14 సీట్లు వస్తాయని మరో ఛానెల్ అంటోందని, అసలు వీళ్ళంతా విశ్లేషించేది ఒక ఎన్నికల ఫలితాలనేనా అంటూ ఓమర్ అబ్దుల్లా ప్రశ్నించారు.
ఒకవేళ వీళ్ళు చెప్పేదంతా అబద్ధమైతే కాంగ్రెస్ నాయకులు అందుకు సంతోషపడే విషయమేగా. ప్రత్యేకంగా నమ్మము అని చెప్పవలసిన అవసరం ఏముంది. ఎన్నికల ముందంటే సరే కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కౌంటింగ్ చేసేవారినైతే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రభావితం చెయ్యవు కదా. అలాంటప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తే మాత్రం ఏమవుతుంది. తథాస్తు దేవతలు కారు కాదు వారంతా.
వాళ్ళ మాటలకి అంకెలు మారిపోవుకదా. మరి దేనికి ఉలికిపాటు అంటున్నారు భాజపా నాయకులు. మీ నమ్మకం మీ దగ్గరుంచుకోండి దేనికి మరి భయం అని అంటున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more