ఖమ్మం పేరు చెబితే .. ముందుగా గుర్తుకు వచ్చేది భద్రాచలం రామయ్య.. ఫైర్ బ్రాండ్ రేణుక చౌదరి. కాంగ్రెస్ పార్టీ లో ఒక వెలుగు వెలిగిన సీనియర్ నాయకురాలు. ఇటీవలే.. అమ్మ ఆగ్రహనికి బలై పదవి వేటు పడిన విషయం తెలిసిందే. రేణుక చౌదరి అంటే తెలంగాణ నేతలకు పడదు. అంటే రేణుకు చౌదరి మొదట్లో తెలంగాణకు వ్యతిరేకంగా అనేక సార్లు మాట్లాడి తెలంగాణ వాదుల ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే, అంతేకాకుండా సొంత పార్టీ నాయకులే.. పైర్ బ్రాండ్ పై.. అప్పుడప్పుడు.. పైర్ అవుతుంటారు. అంతేకాకుండా రేణుక చౌదరికి టిక్కెట్ ఇవ్వద్దని కాంగ్రెస్ హైకమాండ్ చెప్పిన నేతలు చాలా మంది ఉన్నారని ఆమె అనే సార్లు మీడియా ముందు చెప్పటం జరిగిందని.. కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు.
అయితే తాజాగా కేంద్రం తెలంగాణ బిల్లుపై ఆమోద ముద్ర వేసి .. భద్రాచలం డివిజన్ లోని పోలవరం ముంపు గ్రామాలున్న ఏడు మండలాలను సీమాంద్రలో చేర్చడంతో దానికి వ్యతిరేకంగ తెలంగాణ జేఏసీ, విద్యార్థి సంఘాలు ఢిల్లీలోని ఏపీ భవన్ ముందు ఆందోళన చేపట్టారు. సరిగ్గా ఇదే సమయంలో రేణుకా చౌదరి అక్కడికి రావటంతో.. తెలంగాణ ఉద్యోగులు రేణుకా గో బ్యాక్ అంటూ.. నినాదాలు చేయటం జరిగింది. దీంతో రెచ్చిపోయిన రేణుక తన విశ్వరూపం చూపించినట్లు సమాచారం.
ఆ సమయంలో తన సహనాన్ని కోల్పోయిన రేణుక తనను ఎదురు ప్రశ్నిస్తున్న ఓ ఉద్యోగిని పట్టుకుని నోటికొచ్చినట్టు తిట్టారు. ‘నువ్వెవడివిరా మాట్లాడేదానికి... దమ్ముంటే ఇక్కడకు రారా..’ అంటూ సవాల్ విసిరారు. భద్రాద్రి రాముడి ఆలయాన్ని కాపాడుకోవటం తమ లక్ష్యమన్నారు. రామాలయ ఆస్తులపై తెలంగాణ బిల్లులో స్పష్టత ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకే తాను వచ్చానని రేణుక స్పష్టం చేశారు.
అయితే రేణుక చౌదరి తెలంగాణ వాదులపై పోరాడిన తీరు చూస్తే .. అందరికి అనుమానం అనుమానం వస్తుందని తెలంగాణ వాదులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం రావటం రెణుకా చౌదరికి ఇష్టం లేదని, అందుకే తెలంగాణ వాదులపై తొడగొడుతున్నారని తెలంగాణ నేతలు అంటున్నారు. రేణుకా చౌదరి మొదటి నుంచి సీమాంద్ర నేతలకు అనుకూలంగా ఉందని.. ఇప్పుడు ఢిల్లీలో.. తెలంగాణ వాదుల పై తొడగొడుతున్నరంటే.. ఆమెకు తెలంగాణ రావటం ఇష్టం లేదని.. తెలంగాణ వాదులు అంటున్నారు.
అయితే రేణుకా చౌదరి మాత్రం ఢిల్లీలో ఎందుకు రచ్చ చేస్తున్నారో కాంగ్రెస్ పెద్దలకు అర్థకావటం లేదని.. కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. ఏమైన ఫైర్ బ్రాండ్ విషయం కాబట్టి.. కాంగ్రెస్ నేతలు ఎవ్వరు ఖండించే సాహసం చేయటం లేదని .. తెలంగాణ వాదులు అంటున్నారు. అంటే గతంలో.. రేణుకా .. ఖమ్మం జిల్లా ను, సీమాంద్రలో కలపాలని డిమాండ్ చేసినట్లు తెలంగాణ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు రేణుకా హడావుడి అంతే.. రాజకీయ పదవుల కోసమే అని తెలంగాణ వాదులు అంటున్నారు.
రాబోయే ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకొని ఖమ్మం జిల్లా టిక్కెట్ తనకే ఇవ్వాలనే ఉద్దేశం.. కాంగ్రెస్ పెద్దల ముందు తన బలం చూపిస్తుందని తెలంగాణ నేతలు అంటున్నారు. ఈసారి ఫైర్ బ్రాండ్ కు కాంగ్రెస్ అధిష్టానం టిక్కెట్ ఇస్తుందో లేదో చూడాలి. ఏమైన ..పైర్ బ్రాండ్ తో పెట్టుకొని దమ్ము ఎవరికి లేదనే విషయం అర్థమవుతుందని కాంగ్రెస్ కార్యకర్తలు ..గాంధీ భవన్ లో.. గుసగుసలాడుకుంటున్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more