ఒకప్పుడు నేషనల్ మీడియా సైతం.. వైఎస్ జగన్ పేరు.. జపం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రాష్ట్రంలో జాతీయ స్థాయిలో జగన్ సౌండ్ వినబడటం కనుమరుగవుతుందని రాజకీయ మేథావులు అంటున్నారు. దీనిపై జగన్ పై అభిమానం ఉన్న వారికి కోపం రావచ్చు. కానీ .. నిజం తెలుసుకుంటే .. ఎవరికైన మంచిదేనని కొన్ని రాజకీయ సర్వేలు చెబుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ నుండి ..బయటకు దూకిన.. జగన్.. ఏం సాధించారు? రాష్ట్ర ప్రజల కోసం ఏం చేసారు? జగన్ ఆశయం , ఆశ, పదవి వ్యామోహం కోసం ఆయన పార్టీ పెట్టి.. సొంత లాభమే చూసుకోవటం జరిగింది అనేది.. కాకరకాయలో చేదు ఉన్నది ఎంత నిజమో.. జగన్ పార్టీ కూడా అంతే నిజమని.. కొంత మంది రాజకీయ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు
అసలు జగన్ దేని కోసం రాజకీయ పార్టీ పెట్టారు? రాష్ట్ర ప్రజలకు మేలు చేయ్యాలనే మంచి ఉద్దేశంతోనే పార్టీ పెట్టారు. ఓదార్పు యాత్ర పేరుతో.. కొన్ని కొట్లు ఖర్చు చేసి సానుభూతి సంపాదించుకొని ఉప ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీలో.. కొన్ని కూర్చీలను కైవసం చేసుకున్నారు.
అయితే కాంగ్రెస్ పార్టీ తెరపైకి.. తెలంగాణ రాష్ట్రం టైటిల్ ను తేవటంతో.. వెంటనే.. జగన్ సమైక్యాంద్ర ఏజెండా ఎత్తుకున్నారు. సమైక్యాంద్ర కోసం.. ఇంటి వద్ద దీక్షలు, రోడ్డు మీద ధర్నాలు, మైదానంలో గర్జనాలు , అసెంబ్లీలో వాకౌట్లు.. సీమాంద్ర ప్రజల కోసం జగన్ , ఆ పార్టీ నాయకులు చెమటోర్చారు. కానీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచలేకపోయారని.. సీమాంద్ర ప్రజలు అంటున్నారు.
వైఎస్ జగన్ ..ఎంత వేగంతో సమైక్యాంద్ర కోసం దూకుడు పెంచారు. అంటే.. ఊగే ఉయ్యాలా ఊగి.. ఊగీ. చివరకు.. ఎక్కడైతే మొదలైంది మళ్లీ అక్కడకే వచ్చి ఆగుతుందనే సత్యాన్ని.. జగన్, ఆ పార్టీ నాయకులు సీమాంద్ర ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించారు.
తెలంగాణ బిల్లును అడ్డుకుంటామని, ఆకేలిసిన ..ఆంబోతులు అరిచి గీపెట్టి మీడియా ముందు గోల గోల చేసి, సీమాంద్ర ప్రజలకు నిద్రలేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్ పార్టీకే దక్కుతుందని సమైక్యవాదులు అంటున్నారు.
వైఎస్ జగన్ కు పోటీగా.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. తెలంగాణ, సీమాంద్ర నాకు రెండు కళ్లు లాంటివి అంటూ.. రెండు చక్రాల సైకిల్ తొక్కుతూ.. తెలుగు తమ్ముళ్లును కాపాడుకుంటూ.. ముందుకుపోతున్నారు.
ఇక తెలంగాణ బిల్లు ఆఖరి పైట్ జరుగుతున్న తరుణంలో.. చంద్రబాబు ..ఢిల్లీకి పోయి.. ఆ అమ్మ ఇంటికి (జయలలిత), ఈ అమ్మ ఇంటికి(మమత) వెళ్లి.. రాబోయే ఎన్నికల గురించి, ఇప్పుడే మైత్రి సంబంధం పెట్టుకోవటంలో బాబు బాగా బిజీగా ఉన్నారు. కమలం పువ్వు నాయకులతో చేతులుకలుపుతూ.. రాబోయే ముఖ్యమంత్రి పదవి గురించి కలలు కంటూ కాలం వెల్లబుచ్చుతున్నారని.. సీమాంద్ర ప్రజలు అంటున్నారు.
ఇక జగన్.. అసలే ఫ్యాన్ గుర్తు.. అందులోను మూడు రెక్కలు.. సమైక్యాంద్ర కోసం సుడిగాలి బీభత్సన్ని స్రుష్టించాల్ని జగన్ కరెంట్ లేని ఫ్యాన్ లా రెక్కలను విశాలంగా చూపిస్తూ.. వాడిపోయిన ముఖంతో జగన్ కనిపిస్తున్నారని .. సమైక్యవాదులు అంటున్నారు.
ఎలాగో తెలంగాణ రాష్ట్రం ఏర్పాడుతుంది కాబట్టి, సమైక్యాంద్ర కోసం పోరాటం చేయటం అనవసరం అని ..ఆగిపోయారా ? లేక ఉద్యమాలు, ధర్నాలు, ధీక్షలు చేసి అలిసి పోయారా ? అనే అనుమానం సీమాంద్ర ప్రజలకు కలుగుతుందని కరుడుగట్టిన సమైక్యవాదులు గుసగుసలాడుకుంటున్నారు.
అసలే రాజకీయ నాయకులు పదవుల కోసం, గోడలు దూకుతున్న రోజులివి. అందులోనే రాష్ట్రం విడిపోవటం ఖాయమని ..ఖచ్చితమైన సంకేతాలు.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుండి వెలువడుతున్నాయి. ఇలాంటి సమయంలో జగన్ సైలెంట్ గా ఉండటం పై ఆయన అభిమానులకు, ఆ పార్టీ కార్యకర్తలు అనుమానం కలుగుతుందని.. అంటున్నారు.
కొసమెరుపు : ఎంత మంది సమైక్యవాదులు, సీమాంద్ర నాయుకులు ఉన్నప్పటికి.. అమ్మ (సోనియాగాంధీ) మనసును మార్చలేకపోయారు? రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచలేకపోయారు అనేది నగ్న సత్యం. ‘‘నాయకుడు నిజాయితీగా ఉంటే.. నాలుగు తరాలకు ముందు బాట వేస్తాడు. నాయకుడు అవినితీగా ఉంటే.. నాలుగు తరాల భవిష్యత్తును అంధాకారంలోకి నెట్టేస్తాడు అనేది.. రుజువు అయ్యింది..
ఉదా: కేంద్ర క్యాబినెట్ లో .. మనం రాష్ట్రం నుండి నాలుగురు మంత్రులు ఉన్నారు. ముగ్గురు సీమాంద్ర ప్రాంతానికి చెందిన వారు.. ఒకరు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు. సీమాంద్ర మంత్రులు.. పదవికోసం ఉన్నారు.. తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రి .. ఆ ప్రాంత ప్రజలకు కోసం ఉన్నారు. వారు ఎవరు అనేది మీరే తెలుసుకోండి....
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more