హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో కాంగ్రెస్ నాయకుల మద్య ఒకటే హాట్ హాట్ చర్చలు సాగుతున్నాయి. సీమాంద్ర నాయకులే ఎక్కువుగా చర్చలు జరుపుతున్నారు. నిన్న నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఢిల్లీ పెద్దలకు రాత్రి నిద్రలేకుండా చేశాయి. గత మూడుస్లారుగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఈ సారి మాత్రం కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఊడ్చేచారు ఢిల్లీ ప్రజలు. కాంగ్రెస్ పార్టీ ఇంత పరాజయం జరగటానికి గల కారణాలు ఏమిటి అని రాజకీయ విశ్లేషకులు అధ్యయనం చేసి.. ఒక విషయాన్ని బయట పెట్టారు. దేశ రాజధాని ఢిల్లిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీకి కావలసినంత మెజారిటీ లేని పరిస్థితి కేవలం తెలుగు ప్రజల వల్లే వచ్చిందని, రెండు జాతీయ పార్టీలు కలవరానికి గురవుతున్నాయి. వెలువడిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలలో ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సీట్లు రాలేదు.
ఢిల్లీ విధానసభ అధికారానికి భారతీయ జనతాపార్టీ గత 15 ఏళ్లుగా దూరంగా ఉంటోంది. అయితే ఈసారి కొంత ఢిల్లీ ప్రజలు ఊరటనిచ్చినా, ఆంధ్రప్రదేశ్ విభజనకు మద్దతుగా నిలిచిన భాజపాకు తెలుగు ప్రజలు తమ తడాఖా చూపి ఓటింగ్కు దూరంగా వుండడమో, లేక తమ ఓటును కాంగ్రెస్కు, భాజపాకు కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీకి వేశారని తెలుస్తున్నది. కేవలం పాస్ మార్కులు మాత్రమే సాధించిన భాజపాలో పార్టీ వర్గాలు నిర్వహించుకున్న సమావేశంలో తెలుగు వారి ఓటింగ్పై చర్చించినట్లు సమాచారం. వాస్తవానికి ఓట్ల నమోదు కార్యక్రమంలో ఈ ఎన్నికల కంటే ముందు చాలా బాగా జరిగిందని కనీసం 82 శాతం అయినా పోలింగ్ జరిగే అవకాశం వుందని అందరూ భావించారు. అధ్యయనాలు కూడా ఇవే వెల్లడించాయి. కాని వారి అంచనాలను తలకిందులు చేస్తూ పోలింగ్ చాలా తక్కువగా నమోదైంది. దానికి కారణం ఢిల్లీలో వున్న తెలుగువాళ్లు చాలా వరకు ఓటింగ్కు దూరంగా ఉండడమేనని భాజపాకు కలవర పెడుతున్న విషయమని విశ్వసనీయ సమాచారం.
తెలుగు అసోసియేషన్లు, తెలుగు ఉద్యోగ సంఘాలు, ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు అయివుండి, ఢిల్లీలో వ్యాపారాలు చేసుకుంటూ హైదరాబాదు పరిసర ప్రాంతాలలో ఆస్తులు కలిగి ఉన్న వాళ్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు భాజపా, కాంగ్రెస్కు వ్యతిరేకంగా తిరస్కార ఓట్లు లేదా ఆమ్ ఆద్మీ పార్టీకి ఓట్లు వేసినట్లు భాజపా గమనించింది. దీనిని బట్టి రాష్ట్ర విభజన సెగ దేశ రాజధానిని కూడా తాకిందని భావించవచ్చు. ఢిల్లీ ఆ పరిసర ప్రాంతాలలో (ఎన్సీఆర్) సుమారు 5.5 నుంచి 7 లక్షల ఓట్లున్నాయి. ఈ ఓట్లే ఢిల్లీలో అధికారాన్ని నిర్ణయించేదని రాజకీయ పార్టీలు లెక్కలు కడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోర పరాజయానికి తెలుగు ఓట్లు కూడా కారణమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ఇది కేవలం ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన పై మొండిగాపోతున్న సోనియా గాంధీని తాకిన తెలుగు వాళ్ల సెగ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. రాష్ట్ర విభజన జరిగితే.. సీమాంద్రలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. సోనియా గాంధీ ఈ ఫలితాలపై సుదీర్ఘ ఆలోచనల్లో పడినట్లు ఢిల్లీ వర్గాలు అంటున్నారు. ఆంద్రప్రదేశ్ సమైక్యంగా ఉంటేనే రాజకీయ పార్టీలకు బలం అనే విషయం ఢిల్లీ పెద్దలకు తెలిసిపోయిందని.. సీమాంద్ర నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more