రాష్ట్ర విభజన ను అతి వేగంగా కోరుకుంటున్న కాంగ్రెస్ నాయకుడు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్. ఆయన త్వరలోనే రాష్ట్ర పర్యటనకు వస్తానని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా తాను పర్యటించనున్నట్లు తెలిపారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై మాట్లాడేందుకు దిగ్విజయ్ నిరాకరించారు. నరేంద్ర మోడీపై వ్యాఖ్యలు జగన్ వ్యక్తిగతమని ఆయన అన్నారు. సీమాంద్ర కాంగ్రెస్ నాయకులు ఆంటోని కమిటీ రాష్ట్రానికి రప్పించాలని చూస్తున్న తరుణంలో.. దిగ్విజయ్ సింగ్ వస్తాననటం పై రాజకీయ నాయకుల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో దిగ్విజయ్ సింగ్ కు మద్య నడుస్తున్న వివాదం తెలిసిందే. డిగ్గీ రాజ రాష్ట్రానికి వస్తున్న తరుణంలో సీమాంద్ర కాంగ్రెస్ నాయకులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో పర్యటన పై ఎలాంటి రిపోర్టును కాంగ్రెస్ హైకమాండ్ కు అందజేస్తారోనని సీమాంద్ర నాయకులు, తెలంగాణ నాయకులు ఆందోళన చెందుతున్నారు.
శరద్ పవార్ హెచ్చరికలు
ఆహార భద్రత బిల్లుపై శరద్ పవార్ ఈరోజు హెచ్చరికలు జారీ చేశారు. దేశీయంగా ఆహార ఉత్పత్తులను పెంచుకోకపోతే పథకాన్ని నడపలేమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన కేంద్ర వైఖరిపై విమర్శలు గుప్పించారు. ఎక్కడ నుంచో దిగుమతులు చేసుకుంటే పథకాన్ని ఎలా నడుపుతామని ఆయన మండిపడ్డారు. దిగుమతులు ఆధారంగా పథకాన్ని నడపలేమని తెలిపారు. సహాయమంత్రి కె.వి.థామస్ మాట్లాడుతూ.. ఆహార ధాన్యాలను నడపడం కష్టమైన పని అని పేర్కొన్నారు. నిజమైన లబ్ధిదారులను ఎంపికపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం అసలైన లబ్ధిదారులను ఎంపిక చేస్తే భద్రత పథకానికి మేలు చేకూరుతుందని హితవు పలికారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more