కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పై నిర్ణయం తీసుకోవడానికి, రోడ్ మ్యాప్ లు, కోర్ కమిటీ భేటీలు , సీడబ్య్లూసీ మీటింగులు అంటూ హస్తినలో హంగామా చేస్తూ, రాష్ట్ర ఏర్పాటు దిశగా అడుగు వేస్తుందంటూ స్పష్టమైన సంకేతాలు పంపుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత కేసీఆర్ లో, ఆ పార్టీ శ్రేణుల్లో కలవరం మొదలైనట్లు కనిపిస్తోంది. ఈ విషయంలో కేసీఆర్ ఎలా స్పందించాలో అర్థం కాక ఆ పార్టీ అధినేత కెసిఆర్ మల్లగుల్లాలు పడుతున్నట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదనిచెబుతూ వస్తున్న కెసిఆర్ నిజంగానే అది సాధ్యమైతే పార్టీ పరిస్థితి ఏమిటన్న అయోమయంలో పడిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తమ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడానికైనా వెనుకాడేది లేదని ఆయన పలుమార్లు బహిరంగంగానే ప్రకటించారు. ఇప్పుడు ఆ ప్రకటనలు ఆయన్ను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని అంటున్నారు.
ప్రస్తుతం రాష్ట్రానికి వస్తున్న సంకేతాలు, ఢిల్లీలో జరుగుతున్న పరిణామాల నేపధ్యంలో ఎలా స్పందించాలో తెలియక కేసీఆర్ మల్లగుల్లాలు పడుతున్నాయి. కేంద్రం రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి, హైదరాబాద్ ను ప్రత్యేకంగా ఉంచి ఢిల్లీ తరహాలో కేంద్రమే పాలించాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇన్ని రోజులు హైదరాబాద్ లేని తెలంగాణను ఒప్పుకోమని ప్రజలకు, పార్టీనేతలకు చెప్పిన కేసీఆర్ కేంద్రం రాయల తెలంగాణ ఇచ్చి, హైదరాబాద్ పేరు మీద ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తే ఏం చేద్దామనే ఒత్తిడి ఆయన పై తెస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ఏర్పాటైతే ఆ క్రెడిట్ అంతా టిఆర్ఎస్కే దక్కుతుందని అంతా భావించారు. కానీ పరిస్థితులు తారు మారు కావడంతో ఆయన పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలాగా ఉందని అంటున్నారు. పార్టీ అధినేత తాజా పరిణామాలపై స్పందించకపోవడంతో క్షేత్ర స్థాయి నుంచి ద్వితీయ శ్రేణి నాయకులు సైతం ఎవరూ నోరు మెదపడానికి సాహసించడం లేదు. ఒక వేళ పార్టీని విలీనం చేస్తే గతంలో ఆ పార్టీని నమ్ముకున్న నాయకులకు గతంలో పీఆర్పీ పార్టీని విలినం చేసిన తరువాత ఆ పార్టీ నేతలకు కాంగ్రెస్ లో జరిగిన అవమానమే మాకు జరుగుతుందని వారు మధనపడుతున్నట్లు రాజీకీయ విశ్లేషకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more