జింబాబ్వే టూర్ లో కుర్రాళ్ళు మంచి జోరు మీద ఉన్నారు. మొదటి వన్డే గెలిచిన ఊపునే రెండో వన్డేలో కొనసాగించారు. ‘సెల్ కాన్ కప్ ’ భాగంగా నేడు జింబాబ్వే - భారత్ మధ్య జరిగిన రెండో వన్డేలో భారత్ 58 పరుగుల తేడాతో విజయం సాధించింది. ధావన్ బ్యాటింగులో అదరగొట్టి సంచరీ చేయడంతో పాటు బౌలర్లు సమిష్టిగా రాణించడంతో రెండో వన్డే కూడా భారత్ వశమే అయింది. మొదట గెలిచిన జింబాబ్వే టీం ఇండియాను బ్యాంటింగ్ కి ఆహానించింది. టీం ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 294 పరుగుల భారీ స్కోరు చేసింది. బ్యాటింగ్ లో రాణిస్తున్న రోహిత్ శర్మ, కెప్టెన్ కోహ్లీ, రాయుడులు త్వరగానే అవుట్ అయినా, ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీ(116), వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ అర్థ సెంచరీ(69)లతో కదం తొక్కారు . ఐదో వికెట్ కు వీరిద్దరూ 145 బంతుల్లో 150 పరుగులు జోడించి జట్టుకు మంచి స్కోరు అందించారు. జింబాబ్వే బౌలర్లలో విటోరి 2 వికెట్లు పడగొట్టాడు. ఛతారా, జార్విస్, ఉతసియ తలో వికెట్ తీశారు.
అనంతరం భారత్ నిర్ధేశించిన 295 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలో దిగిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 236 పరుగులు మాత్రమే చేసి మరో ఓటమిని తన ఖాతాలో వేసుకున్నారు. జింబాబ్వే బ్యాట్స్ మెన్స్ ఆదిలోనే భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఓ దశలో జింబాబ్వే 100 పరుగులకు ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి పటిష్టంగా కనిపించింది. కానీ 120 పరుగుల తరువాత ఉనాథ్కన్ వరుసగా రెండు వికెట్లు తీయడంతో జింబాబ్వే పతనం ప్రారంభం అయింది. సిబందా 55, ఉతసియ 52, చిగుంబుర 46, మసకజ్జా 34 పరుగులు మినహా మిగతా వారు పెద్దగా రాణించలేక పోయారు. భారత బౌలర్లలో ఉనద్కత్ 4 అమిత్ మిశ్రా 2 వికెట్లు తీశారు. షమీ, జడేజా చెరో వికెట్ దక్కించుకున్నారు. దీంతో సిరీస్ లో భారత్ 2 – 0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more