ఒక్క ఎస్ఎంఎస్ తో కీలకమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇలాంటి ఎస్ఎంఎస్ వల్ల పోలీసులు దోషులను త్వరగా పట్టుకుంటున్నారు. చత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో గత నెలలో జరిగిన మావోయిస్టుల భీకర దాడి వెనుక ముఖ్యమంత్రి రమణ్ సింగ్ హస్తం ఉందనే అనుమానాలను బలపర్చే ఓ కీలక ఎస్ఎంఎస్ సంచలనం కల్గించింది. కాంగ్రెస్ కాన్వాయ్పై మావోయిస్టుల దాడిలో పలువురు కీలక కాంగ్రెస్ నేతలు హతులయ్యారు. గత నెల 23న పీసీసీ నేత నంద్కుమార్ పటేల్ కుమారుడు దినేష్ పటేల్ తన సెల్ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ మీడియా విభాగం అధ్యక్షులు నితిన్ త్రివేదికి పంపిన ఎస్ఎంఎస్ను ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు మీడియాకు వెల్లడించాయి. ఈ ఎస్ఎంఎస్ తరువాత రెండు రోజులకు అంటే మే నెల 25న మావోయిస్టులు జరిపిన దాడిలో పీసీసీ అధినేతతో పాటు ఆయన కుమారుడు దినేష్ కూడా చనిపోయాడు. పైగా దాడిలో మావోయిస్టులు అత్యంత క్రూరంగా సల్వాజుడం అధినేత మహేంద్ర కర్మను, దినేష్ పటేల్ను చంపివేశారు.
దినేష్ను వారు అంత భీకరంగా ఎందుకు చంపారనేది ఇప్పటికీ అంతుపట్టకుండా ఉందని ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయి. దినేష్ ఎవరని మావోలు పదేపదే అడిగారని, తెలుసుకున్న తరువాత ఆయన లాప్టాప్ను సోదా చేశారని మావోలకు ఆయన లాప్టాప్తో పని ఏమిటని, రమణ్ సింగ్కు దినేష్తో ఉన్న కక్షతోనే ఈ దారుణ హత్యకు మావోలు పాల్పడి ఉంటారని ఎస్ఎంఎస్ను మీడియాకు వెల్లడించిన కాంగ్రెస్ ప్రతినిధి తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో ప్రత్యక్షంగా సంబంధం లేని దినేష్ను ఎందుకు హతమార్చారనేది ఇప్పటికీ మావోలు వివరణ ఇచ్చుకోవడం లేదు. దినేష్ పంపిన ఎస్ఎంఎస్ను బట్టి చూస్తే, ముఖ్యమంత్రికి, దినేష్కు ఏదో ఒక అంశంపై తగాదా వచ్చి ఉంటుందని, అందుకే ఎస్ఎంఎస్ పంపిన రెండు రోజులకే మావోలు దాడికి దిగి ఇతరులతో పాటు దినేష్ను చంపివేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
దినేష్ ఎస్ఎంఎస్లోని గుట్టు ఏమిటీ? రమణ్ సింగ్కు ఉన్న సంబంధం ఏమిటీ? అనే అంశాలను ఇప్పుడు దర్యాప్తు సంస్థలు వెలికితీయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దినేష్ తనకు పంపిన ఎస్ఎంఎస్లోని అంశం తనకు అవగతం కావడం లేదని కాంగ్రెస్ ప్రతినిధి నితిన్ త్రివేది చెప్పారు. అయితే కాంగ్రెస్ ఆరోపణలను ఛత్తీస్గఢ్ బీజేపీ వర్గాలు కొట్టిపారేశాయి. ఘటనపై ఇప్పటికే దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయని, ఏ విషయం అయినా దీనిలో తేలుతుందని, ఏదో ఎస్ఎంఎస్ను పట్టుకుని కాంగ్రెస్ వారు చవకబారు రాజకీయాలకు దిగడం సరికాదని, తమకు వచ్చిన ఎస్ఎంఎస్ను కాంగ్రెస్ వారు దర్యాప్తు సంస్థలకు అప్పగిస్తే సరిపోతుందని, అలా కాకుండా దీనిని పట్టుకుని శవరాజకీయాలకు దిగుతున్నారని బీజేపీ విమర్శించింది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more