విశాఖ పార్లమెంట్ స్థానం కోసం ఆ పార్టీ సీనియర్ నేతలు టి.సుబ్బిరామిరెడ్డి, పురందేశ్వరిల మధ్య పోటీ తీవ్రమైంది. రానున్న ఎన్నికల్లో పురందేశ్వరికి విశాఖ ఎంపి స్థానాన్ని కేటాయించవద్దని, దానిని తనేక కేటాయించాలని టి.సుబ్బిరామిరెడ్డి కొన్ని రోజుల క్రితం ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి విన్నవించిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్రమంత్రి పురందరేశ్వరి భర్త, ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు, టి.సుబ్బరామిరెడ్డిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన సిఎల్పి కార్యాలయంలోమాట్లాడుతూ, టి.సుబ్బరామిరెడ్డి అవినీతి చరిత్రంతా తనకు తెలుసునని అన్నారు. వేలకోట్ల రూపాయల ఆస్తులను ఆయన ఎలా కూడబెట్టింది తనతో పాటు రాష్ట్ర ప్రజలకు తెలుసని అన్నారు.
సిమెంట్ బస్తాలను బ్లాక్లో అమ్ముకున్న చరిత్ర రాష్ట్ర ప్రజలకు తెలుసునని దగ్గుబాటి అన్నారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో రాజీవ్గాంధీ రహదారిపై పనుల్లో ఎన్ని వేలకోట్ల రూపాయలు సుబ్బిరామిరెడ్డి ఎలా దండుకున్నది కూడా తనకు తెలుసునని అన్నారు. దీనిపై అప్పట్లో శాసనసభాసంఘం ఏర్పడి విచారణ జరిపిందని దగ్గుబాటి గుర్తుచేశారు. ముఖ్యంగా నరసరావుపేట ఎంపి స్థానాన్ని తాము కోరుకున్నామని సుబ్బరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. 2009లో విశాఖ ఎంపి స్థానానికి పురందేశ్వరికి కేటాయించవద్దని సుబ్బిరామిరెడ్డి లేఖ కూడా రాశారని దగ్గుబాటి అన్నారు.
అయితే దానిపై అధిష్టానానికి తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదని అన్నారు. అధిష్టానం సూచన మేరేక తాము ఎన్నికల్లో ఏ స్థానం నుంచి పోటీ చేసేది తెలుస్తుందని అన్నారు. పురందేశ్వరిపై సుబ్బరామిరెడ్డి అర్థంలేని విమర్శలు చేస్తున్నారని అన్నారు. కాంట్రాక్టుల్లో ఉన్న లోసుగులను తనకు అనుకూలంగా మలుచుకుని సుబ్బిరామిరెడ్డి డబ్బు సంపాదించిన ఘన చరిత్ర తనకు తెలుసని అన్నారు. తప్పుడు క్లయిమ్లు చేస్తూ ఆయన వేలకోట్లకు పడగలెత్తాడని దగ్గుబాటి విమర్శించారు. ప్రజల్లో గుర్తింపు పొందేందుకు చిత్ర పరిశ్రమలో పనికి మాలిన బిరుదులను నటులకు అందిస్తూ వారి మెప్పు పొందేందుకు ఇలాంటి పనులు చేస్తున్నాడని విమర్శించారు. పార్టీ, అధిష్టానం నిర్ణయించిన మేరేక పురందరేశ్వరి పోటీ చేస్తుందని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more