ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మెయప్పన్ అరెస్టు కావడంతో బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని కేంద్ర క్రీడల శాఖమంత్రి జితేంద్ర సింగ్, బీసీసీఐ ఫైనాన్స్ కమిటీ చైర్మన్, కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాలే కాకుండా పలువురు ఈయన పై తీవ్ర ఒత్తిడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వారు చేస్తున్న డిమాండ్లను పట్టించుకోకుండా, రాజీనామా చేయను అని చెప్పుకొస్తున్న బీసీసీఐ ఛీఫ్, వారి ఒత్తిడి మేరకు ఈ రోజు మరోసారి దీని పై మీడియాతో మాట్లాడుతూ.... ఎన్. శ్రీనివాసన్ నేడు మీడిమా ముందుకు వచ్చి బీసీసీఐ అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేయను అని మరోసారి ఖరాఖండిగా చెప్పారు. తంలో ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చినప్పుడు బీసీసీఐ ఛీప్లెవరూ రాజీనామా చేయలేదని గుర్తు చేశారు. స్పాట్ ఫిక్సింగ్ కేసు దర్యాప్తులో తాను జోక్యం చేసుకోనని తేల్చిచెప్పారు. దర్యాప్తు ప్యానల్ దోషులని తేలిస్తే చెన్నై సూపర్ కింగ్స్పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. తనపై ఆరోపణలు లేనప్పుడు ఎందుకు పదవి నుంచి వైదొలగాలని ప్రశ్నించారు.
ఇదిలా ఉండే బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ కు లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్జేడీ) బాసటగా నిలిచింది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ లో శ్రీనివాసన్ పై ఎటువంటి నేరాభియోగాలు మోపనందున ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం లేదని బీహార్ క్రికెట్ అసోసియేషన్(బీసీఏ) వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ బారి సిద్ధిఖీ అన్నారు. మరో వైపు ఈ కేసుకు సంబంధించి మరిన్ని అరెస్టులు చేస్టున్నారు. తాజాగా శ్రీశాంత్ స్నేహితుడు అభిషేక్ శుక్లాతోపాటు మరో ముగ్గురిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అజిత్ చండీలా, అంకిత్ చవాన్, శ్రీశాంత్ తోపాటు మరో 26 మందిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. మరి ముందు ముందు ఈ కేసుకు సంబంధించి ఎంత మంది అరెస్టు అవుతారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more