ఐదు సంవత్సరాల బాలిక మీద అత్యాచారం జరిగి ఆ పసికందు ప్రాణాలు రెపరెపలాడుతున్న వార్త తెలిసిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు జరపవలసిన వేడుకలను రద్దు చేసుకున్నట్టుగా ప్రకటించారు.
200 రోజుల పాదయాత్ర పూర్తిచేసుకోవటం, ఈ రోజు ఆయన జన్మదినం అవటంతో విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ సభ్యులు అత్యంత ఉత్సాహంతో సంబరాలకు సన్నాహాలు చేసుకున్నారు. ఈ వేడుకలలో పాలుపంచుకోవటానికి చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి కూడా విశాఖపట్నం చేరుకున్నారు. కుమారుడు లోకేష్, ఇతర పార్టీ నాయకులు కూడా చేరుకుంటున్న సందర్భంలో చంద్రబాబు పూర్తిచేసుకున్న వసంతాల సంఖ్యలో 64 కిలోల కేక్ కటింగ్ కి తయారుగా ఉండగా, అకస్మాత్తుగా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవటంతో పార్టీలో సభ్యులు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు.
కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఢిల్లీ పాప మీద పాపకృత్యానికి మనసు వికలమై ఈ రోజు వేడుక చేసుకోవటానికి అంగీకరించటంలేదని అన్నారు.
తూర్పు ఢిల్లీలో పసికందు మీద పక్కింటి మనిషి చేసిన అత్యాచారం ఢిల్లీనే కుదిపేసింది. దానితో పాటు పోలీసుల నిర్లక్ష్యం ఆందోళనలకు దారితీసింది. ఐదు సంవత్సరాల పసిమొగ్గని గదిలో బంధించి కొవ్వొత్తులు బాటిల్స్ ఉపయోగించి చేసిన రాక్షసత్వం ఎవరినైనా వేదనకు గురిచెయ్యక మానదు. దేశం ఏ దిశగా పోతోంది, మానవుల మానవత్వం ఇంకా ఎంతగా మంటగలిసిపోతుందన్న బాధ ప్రతి ఒక్కరినీ వేధించే ప్రశ్నే.
బాధ ఎవరికైనా ఉంటుంది కానీ దాన్ని కూడా రాజకీయం చేసుకోవటం ఇంకా బాధాకరమైన విషయం. ఢిల్లీ షాహదరా లోని హాస్పిటల్ లో బాలిక చికిత్స జరుగుతుండగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వాళ్ళ ఆందోళన సబబే అయినా ఏ చిన్న సాకు దొరుకుతుందా ఆందోళనచేద్దామని ప్రతిపక్షాలు అనుకోవటం, చేతకానితనాన్ని ఎండగడుతున్నారనే కోపంతో పాలకపక్షం వాళ్ళ మీద విజృంభించటం కూడా జరుగుతుంది. ఎలక్ట్రానిక్ మీడియా పుణ్యమాంటూ ఆందోళన చేస్తున్న వాళ్ళమీద పోలీసులు అతిగా ప్రవర్తించటం కేమెరాల్లో చిక్కింది. దాంతో ఆ పోలీసు అధికారులను సస్పెండ్ చెయ్యటం కూడా జరిగింది.
మానవుని రూపంలో ఉన్న ఆ రాక్షసుడి పేరు మనోజ్ కుమార్ అని, బాహార్ ముజప్ఫర్ నగర్ వాసి అని తెలిసింది. పోలీసులు వేటాడి అతన్ని పట్టుకున్నారు. కోర్టులో హాజరుపరచగా ఈ నెల 23 వరకు అతనికి రిమాండ్ విధించారు.
మనసు వికలమైనప్పుడు సంబరం చేసుకోవటం కష్టం కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ రోజు వేడుకలు రద్దు అని అన్నారు. సర్వసన్నాహాలు చేసుకున్న పార్టీ శ్రేణులకు నిరాశకలగటం సహజమే కానీ అధినాయకుని మాటకు తిరుగులేదుగా. రాజకీయ దృష్టి కోణంలో దీనికీ వంకపెట్టేవారున్నారు. వార్తలలోకి రావటం కోసం ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారంటూ అనేవారూ ఉంటారు. నటుడు నిజంగా బాధపడ్డా అదంతా నటనే అనుకుంటారు. సర్కస్ లో జోకర్ నిజంగా కిందపడ్డా అందరూ నవ్వుతారు. రాజకీయ నాయకుడు ఏం చేసినా అదంతా రాజకీయమే అనుకుంటారు. ఏం చేస్తాం మరి, తాటి చెట్టు కింద నిల్చుని పాలు తాగుతున్నానంటే నమ్మటం కష్టమే మరి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more