నిన్న అత్యంత వైభవంగా భద్రాచల రాముడుకి కళ్యాణ మహోత్సవం జరిగింది. దేవాదాయ శాఖా మంత్రి రామచంద్రయ్య పట్టువస్త్రాలను సమర్పించారు. ఆ తర్వాత ఆనవాయితీ ప్రకారం ముఖ్యమంత్రి ప్రభుత్వం తరఫునుంచి పట్టువస్త్రాలు, మంచి ముత్యాలు స్వామివారికి సమర్పించారు.
ఈ రోజు రామచంద్రమూర్తిని నయనానందంగా పట్టాభిషిక్తులను కావించే పనిలో దేవస్థానం యాజమాన్యం, సిబ్బంది, అర్చక బృందం నిమగ్నమై ఉండగా భక్త జనసందోహం ఆ సన్నివేశాన్ని కళ్ళార్పకుండా తిలకించటానికి ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్నారు.
పట్టాభిషేకం ఎందరో రాజులకు జరిగింది. పట్టం కట్టినా కట్టకపోయినా రాజ్యాన్ని సంపాదించి పాలించినవారు చరిత్రలో అనేకమంది రాజులున్నారు. కానీ శ్రీరాముడి పట్టాభిషేకానికో ప్రత్యేకతుంది. అది రామరాజ్యానికి అంకురార్పణ. అన్నివిధాల యోగ్యుడైనా శ్రీరాముడు తనంతట తాను రాజ్యాన్ని గైకొనలేదు. తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టటం కోసం రాజ్యాన్ని రాజలాంచనాలను విడిచి సతీసమేతంగా అరణ్యవాసం చేసాడు. రాముని పాలన ఎలా ఉంటుందో తెలియకపోయినా రాముని గుణగణాలను తెలుసుకున్న అయోధ్యవాసులు రాముడిని పోనివ్వకుండా అడ్డుపడ్డారు.
చివరకు రాక్షస సంహారం చేసి సతీసమేతంగా అయోధ్యకు తిరిగివచ్చిన రామచంద్రుని పట్టాభిషేకం జనమందరికీ పండుగే అయింది. జనుల ఆశించినదానికి దీటుగా రాజ్యాన్ని ఏలి రామరాజ్యం అనే పేరుని లోకంలో స్థాపించినవాడయ్యాడు శ్రీరాముడు. ఆదర్శ పురుషుడిగా రాముడు, ఆదర్శదంపతులుగా సీతారాములు, ఆదర్శ రాజ్యంగా రామరాజ్యం అప్పటికీ ఇప్పటికీ, ఎప్పటికీ నిలిచిపోయే విధంగా పేరుగాంచటం జరిగింది.
భద్రాచలంలో ప్రతినెల పుష్యమి నాడు పట్టాభిషేకం చేస్తారు. సంవత్సరానికోసారి ఈరోజులా జరిగేది మహాపట్టాభిషేకం. 12 సంవత్సరాలకోసారి జరిగేది పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం, 60 సంవత్సరాలకోసారి జరిగేది మహా సామ్రాజ్య పట్టాభిషేకంకా చెప్పుకుంటారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more