పోస్టాఫీస్ లకు మళ్ళీ పూర్వ వైభవం వస్తుందా. పోస్టాఫీసులు కూడా ఆధునీకరణకు నోచుకుంటున్నాయా.
పూర్వకాలం పోస్టాఫీస్ అంటే చాలా నియమ నిష్టలతో కూడుకున్న పని చేసే బాధ్యతాయుతమైన ఉద్యోగుల కార్యాలయం. ఎర్రరంగు డబ్బాలతో తపాలా డబ్బాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తుండేవి. నిర్దేశించిన సమయానికి అందులోంచి ఉత్తరాలు తియ్యటం, వాటిని ఎక్కడెక్కడికి పంపించాలో సార్టింగ్ చెయ్యటం, తగు స్టాంపులున్నాయో లేదో చూసి దాని మీద ముద్ర వేసి బట్వారా చెయ్యటం, స్టాంపుల విక్రయం, రిజిస్టర్ లెటర్స్ ని తీసుకోవటం, మనియార్డర్ లను తీసుకోవటం, ఇలాంటి పనులను చకచకా సమయం ప్రకారం చేస్తూ కనిపించేవాళ్ళు.
టెలిగ్రాం, టెలిఫోన్లు కూడా అదే శాఖలో ఉండటమే కాకుండా, పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్లలో డబ్బు దాచుకోవటం కూడా జరుగుతుండేది. చెకింగ్ ఎప్పుడు జరుగుతుందో అని పైసా పైసా సరిగ్గా లెక్కపెట్టి తీసుకుని పెట్టుకునేవారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వరంలో నడుస్తుండబట్టి అందులో ఉద్యోగులకు ప్రత్యేక హోదా ఉండేది.
పోస్టాఫీసు, పోస్ట్ మాన్ ల మీద పాఠ్యభాగాలు, కథలు, సినిమాలు కూడా వచ్చాయి. ఒక్క ఉత్తరం ముక్కైనా రాయలేదేం అనటం, రాసాను కదా పోస్ట్ లో మిస్సయిందేమో అని అనుకోవటం కూడా జరుగుతుండేవి. శుభకార్యమైనా, అశుభ వార్తలైనా, ఉద్యోగం లభించినా, ఇంటర్వ్యూ కాల్ అయినా లేక మామూలుగా అప్పుడప్పుడూ తెలియజేసుకునే క్షేమసమాచారాలైనా పోస్టాఫీస్ సాయం లేకుండా జరిగేది కాదు. ఆ సమయంలో ప్రేమికుల ప్రేమలేఖలు కూడా పోస్ట్ లోనే వెళ్తుండేవి.
పోస్టాఫీస్ లకు వచ్చిన మొదటి పోటీ ప్రైవేట్ కొరియర్స్ వలన. కొరియర్స్ ఊపందుకోవటంతో పోస్టాఫీస్ ప్రాముఖ్యం పడిపోయింది. బ్యాంక్ లు పెరిగిపోవటంతో పోస్టాఫీస్ లో డబ్బు దాచుకునే అవసరం తగ్గిపోయింది. పని వేళల తర్వాత కూడా కొరియర్స్ పనిచెయ్యటం, ఎక్కడ బడితే అక్కడ అందుబాటులో ఉండటం, ఆఫీసులకు వచ్చి తీసుకెళ్ళటం లాంటి సేవల వలన పోస్టాఫీస్ కి వెళ్ళేవాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. టెలిఫోన్ వ్యవస్థ పెరిగి ఇంటింటికీ ఫోన్, బయట పబ్లిక్ ఫోన్ లు రావటంతో పోస్టాఫీస్ నుంచి చేసే ట్రంక్ కాల్స్ తగ్గిపోయాయి.
పోస్టాఫీస్ లకు అన్నిటికన్నా పెద్ద శత్రువు సెల్ ఫోన్. దాని తర్వత ఇంటర్ నెట్. వీటి వలన మెసేజ్ లు మెయిల్స్ పంపించుకోవటం కానీ, ఆహ్వానలు చేసుకోవటం, ఇతర సమాచారాలను ఇచ్చి పుచ్చుకోవటానికి వెసులుబాటు కలగటంతో పోస్టాఫీస్ అంటే ఏమిటో అది ఎక్కడుంటుందో ఎలా ఉంటుందో కూడా మర్చిపోయారు చాలామంది. పోస్ట్ అని పాత సినిమాల్లో పోస్ట్ మాన్ అరవటం చూస్తే గుర్తు కొస్తుంది కానీ ఆ పాత సినిమాలను ఆదరించేవారూ కరువయ్యారు.
అభివృద్ధి ఆశించదగ్గదే కాబట్టి పోస్టాఫీస్ ఉద్ధరణ కోసం ఎవరూ పూనుకోలేదు. అయితే కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి దేశంలోని ఒకలక్షా యాభైవేల పోస్టాఫీస్ లను ఆధునీకరణకు పూనుకుని అందుకు 4700 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టబోతున్నట్టుగా చెప్పారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more