పరువు దక్కించిన ఇటాలియన్ల మీద వరాలు గుప్పించిన ప్రభుత్వం.
లోక్ సభలోనూ రాజ్యసభలోనూ భారత విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఇటలీ నావికాధికారుల ఆగమనాన్ని, వాళ్ళ కేసు తీవ్రమైనది కాదు కాబట్టి వాళ్ళకి మరణ శిక్ష ఉండదని తెలియజేసారు. వాళ్ళ నావికులు భారత్ కి వచ్చిన తర్వాత వాళ్ళమీద భారత్ వ్యవహారం ఎలా ఉండబోతుందన్న విషయాన్ని ఇటలీ ప్రభుత్వం అడిగి తెలుసుకుందట. అప్పుడు భారత ప్రభుత్వం, వారికి మరణ దండనైతే ఉండదన్న హామీ ఇచ్చిందన్నారాయన. సుప్రీం కోర్టు ఇచ్చిన గడువు లోపులో వారు భారత్ కి తిరిగి వస్తే వారిని పోలీస్ అదుపులోకి తీసుకోవటం ఉండదనన్న హామీ కూడా ఇచ్చామని ఖుర్షీద్ తెలియజేసారు.
ఈ రోజు ఉదయం సల్మాన్ ఖుర్షీద్ కేరళలో మత్స్యకారులను చంపిన ఇటాలియన్ నావికులు తిరిగి వచ్చే విషయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, భారతదేశ దౌత్య సంప్రదింపులు పనిచేస్తున్నాయని, వాళ్ళు వస్తున్నారని అన్నారు.
ఇదన్న మాట వాళ్ళు చేసిన సంప్రదింపులు. వాళ్ళని రప్పించటం కోసమే అలా మాట్లాడివుంటే సరేనేమో కానీ, ప్రతిపక్షాల ఆందోళన భరించలేక ప్రస్తుతం ఈ గండం నుంచి బయటపడదామని అనుకుంటూ నిందితులను తిరిగి రప్పించటానికి ఎడాపెడా వాగ్దానాలు చేస్తే, అదే ప్రతిపక్షాలతో ఆ తరువాతనైనా గొడవ తప్పదు.
అత్యుత్సాహంతో మత్స్యకారులను కాల్చి చంపి, వాళ్ళు సముద్ర దొంగలనుకున్నాం అంటే, అంత చిన్న చేపల బోటులో వచ్చి అంత పెద్ద నావలోని వారి సరుకులను దొంగిలించుకుని పోతారని ఎలా అనుకున్నారు. అయినా వీళ్ళ నావ మీదకు ఎక్కటానికేమైనా ప్రయత్నం చేసారా వాళ్ళు.
ఇచ్చిన అప్పును తిరిగి తీసుకోవటానికి ఒక్కోసారి, కావాలంటే మళ్ళీ ఇస్తామంటూ వాగ్దానాలు చేస్తారు. ఆ తర్వాత ఇవ్వకపోయినా వాళ్లని ఏమీ చెయ్యలేరు కనుక. కానీ ఒక దేశం మరో దేశానికి చేసే వాగ్దానం సరిగ్గా ఉండాలి. విచారణ జరుగక ముందే దాని పర్యవసానాన్ని ఎలా చెప్పగలరు. మరి న్యాయస్తానాలున్నయెందుకు.
అసలు సరైన హామీ లేకుండా ఒప్పంద పత్రాలు లేకుండా నిందితులను ఇటలీకి పంపించటమే చేసిన మొదటి తప్పు. దాన్ని కప్పిపుచ్చుకోవటానికి మరో తప్పు చేస్తే ప్రస్తుతానికి ఒక సమస్య తీరినట్లే ఉంటుంది కానీ భవిష్యత్తులో ఎదురుతిరిగే అవకాశం ఉంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more