బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్రసమితి పార్టీ ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం పెట్టిన విషయం తెలిసిందే. ఈ అవిశ్వాస తీర్మాన సమయంలో పార్టీ జారీ చేసిన విప్ ని ధిక్కరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన అధికార పార్టీకి చెందిన 9 మంది కాంగ్రెస్ ఎమ్మల్యేల పై, ఆరుగురు తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేల పై వేటు వేసేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పీసీసీ ఛీప్ బొత్స సత్యనారాయణ నేడో, రేపో స్పీకర్ నాదెండ్ల మనోహర్ రావును కలిసి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన వారి పై చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలుస్తుంది. దీంతో రాష్ట్రంలో మనోసారి ఉప ఎన్నికలకు తెరలేస్తుందనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇక ఈ విషయం పై ఢిల్లీ వెళ్లిన బొత్స ఆజాద్ ని కలిసి దీని పై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీలో ఉంటూ, ప్రభుత్వంతో అన్ని పనులు చేయించుకున్న 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అవిశ్వాస పరీక్షలో గోడదూకిన వైనాన్ని సీరియస్గా తీసుకోవాలని, ఇలాంటి క్రమశిక్షణా రాహిత్యంపై మెతక వైఖరి తగదని నిన్న శాసనసభాపక్ష సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు చేసినడిమాండ్ను బొత్స ఆజాద్ దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యేల పై వేటు వేసి ఉప ఎన్నికలకు వెళితే కాంగ్రెస్ కే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు.
ఈ విషయాలన్నింటికి ఆజాద్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. దీంతో మరోసారి ఉప ఎన్నికలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నిర్వహించిన మీటింగ్ కి చాలా మంది సభ్యులు గైర్హాజరు అయ్యారు. అయితే గైర్హాజరు అయిన వారిలో ఎక్కువ మంది టీఆర్ఎస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుందుకు ఆసక్తితో ఉన్నారని అంటున్నారు. అందుకే వీరు సీఎం నిర్వహించిన సమావేశాని హాజరు కాలేదని అంటున్నారు. మరోవైపు తెలుగుదేశం కూడా పార్టీని ధిక్కరించిన వారిపై వేటు వేసేందుకు సిద్ధమవుతోంది. ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు లేఖ రాయనుంది. ఈ పరిణామాలు చూస్తుంటే ఉప ఎన్నికలు రావడం ఖాయంగా కనిపిస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more