కసబ్ ను ఉరితీసినప్పుడు హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ను మెచ్చుకున్న బీజేపి నాయకులు ఇప్పుడు ఆయన కామెంట్ చేస్తున్నారు. హైదరాబాద్లో పేలుళ్ల ఘటనపై హోంమంత్రి షిండే ప్రకటనపై బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హోంమంత్రి ప్రకటన రొటీన్గా ఉందని, ఘటన తీవ్రతకు తగినట్లుగా లేదని ఆమె విమర్శించారు. ఉగ్రవాదుల నుంచి సమాచారం ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె ప్రశ్నించారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పలేదని ఆమె మండిపడ్డారు.షిండే ప్రకటనపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పేలుళ్ల ఘటన ప్రకటనపై సుష్మా స్వరాజ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పేలుళ్ల పైన ప్రకటనలు చేసి చేతులు దులిపేసుకోవడం కాదని, ఎక్స్‑గ్రేషియా ఇవ్వటంతో సమస్య పరిష్కారం కాదని, ఉగ్రవాద చర్యలు అరికట్టేందుకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆమె కేంద్రాన్ని ప్రశ్నించారు. అంతకుముందు లోక్సభ జీరో అవర్లో సుష్మా మాట్లాడుతూ బాంబు పేలుళ్ల ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. పేలుళ్ల ఘటన అత్యంత విషాదకరమన్నారు. ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు ఐక్యంగా పోరాడుదామని ఆమె దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
అమాయకుల ప్రాణాలను బలితీసుకోవడంలో ఉగ్రవాదులు పైచేయి సాధిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రం వద్ద బాంబు దాడులు జరుగుతాయన్న సమాచారం ఉన్నా, ఘటనలు జరుగుతూనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి మతం దృష్టితో చూడరాదని సుష్మాస్వరాజ్ అన్నారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు, ఈ పేలుళ్లకు ఏమైనా సంబంధం ఉందా? అని ఆమె ప్రశ్నించార. హైదరాబాద్, ముంబై, బెంగుళూరులో పేలుళ్లు జరుగుతాయని ఉగ్రవాదులు హెచ్చరించారు. ముంబై, బెంగుళూరులో జరగ కుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని సుష్మా డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more