తెలంగాణ పై ఈ నెల 28న కేంద్రం ఒక ప్రకటన చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రజలకు ద్రుష్టి ఈ నెల 28న పైనే ఉంది. ఆ రోజు ఏం జరుగుతుందో, కేంద్రం తెలంగాణ సమస్యకు ఎలా పరిష్కారం చెబుతుందోనని రాష్ట్ర ప్రజలు , నాయకులు ఎదురుచూస్తున్నారు. అయితే రాజకీయ నాయకులు మాత్రం రకరకాలుగా మాట్లాడుతున్నారు. అసలు కేంద్రం తెలంగాణ ఇస్తానని ఏ రోజు చెప్పలేదని కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మరికొందరు తెలంగాణ ఇవ్వటానికి కేంద్రం సిద్దమైందని అంటున్నారు. ప్రజలు మాత్రం ఎవరివి ఒట్టి మాటలో, ఎవరివి గట్టి మాటలో తెలియక తికమక పడుతున్నారు. అయితే తెలంగాణ సమస్య ఆరోగ్య శాఖ మంత్రి ఢిఎల్ రవీంద్రా రెడ్డి స్పందించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తానని ఎవరు చెప్పలేదని, రాష్ట్ర విభజనపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. సీమాంధ్ర నేతల తీర్మానానికి మద్ధతు తెలిపినట్లు ఆయన చెప్పారు. అయితే వారితో ఢిల్లీ వెళ్లడం లేదన్నారు. జైపూర్లో జరిగే కాంగ్రెస్ మేధోమథన సదస్సులో పాల్గొనన్నుట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ అంశంపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని, అధిష్టానం తీసుకునే నిర్ణయానికే కట్టుబడి ఉంటానని డీఎల్ స్పష్టం చేశారు.
రాష్ట్ర విభజనపై ప్రస్తుతం వస్తున్నవన్నీ ఊహాగానాలేనని ఆయన కొట్టి పారేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు రెఫరెండం అనడం విచిత్రమన్నారు. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా రెఫరెండం జరగలేదన్నారు. కెసిఆర్ రెఫరెండం మాటలు ఉత్తుత్తివే అన్నారు. గురువారం జరిగిన సమైక్యాంధ్ర ప్రజాప్రతినిధుల సమావేశంలో రాజీనామాల అంశం చర్చకు రాలేదని మంత్రి డీఎల్ తెలిపారు. తెలంగాణ ఇస్తారనేది మీడియా సృష్టేనని, ఇప్పటి వరకు తెలంగాణకు ఎలాంటి అనుకూల సంకేతాలు రాలేదన్నారు. అయితే హైదరాబాద్ పేరుతో తెలంగాణను అడ్డుకునేందుకు ఇంటిదొంగలు ప్రయత్నిస్తున్నారని నిజామాబాద్ ఎంపీ మాధుయాష్కి ఆరోపించారు. తెలంగాణ అంశంపై చర్చించేందుకే సీఎస్, డీజీపీ ఇతర అధికారులను ఢిల్లీ పిలిపించిందని ఆయన చెప్పారు. తెలంగాణ వస్తుందనేది ఢిల్లీ వార్త అని, దాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదని మధుయాష్కి అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more