కాంగ్రెస్ పార్టీకి త్వరలో కరెంట్ షాక్ తగలనుంది? ముందుగానే రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అప్రమత్తం అయ్యి, పార్టీలోని మంత్రులకు, ఎమ్మెల్యేలతో సమావేశం అవుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఇంటి సమస్యలకు తోడు కరెంట్ సమస్య మరింత ఇబ్బంది పెట్టనుంది. త్వరలో సహకార ఎన్నికలు ఆ తరువాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కరెంట్ సమస్య పెద్ద ఇబ్బందిగా మారనుంది. ఇప్పటికే విద్యుత్ సర్ చార్జీలపై ప్రజలు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. పదేళ్ల క్రితం సర్ చార్జీలను ప్రజలపై బలవంతంగా రుద్దడంతో వారు కాంగ్రెస్ పార్టీపై మండిపడుతున్నారు. నియోజక వర్గాలకు వెళ్లే ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ నెల 7న విజయవాడలో జరిగే కాంగ్రెస్ ప్రాంతీయ సదస్సు ఏర్పాట్ల కోసం గుంటూరు, కృష్ట, పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలతో పిసిసి అధ్యక్షుడు బొత్స,ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి తీసుకునే చర్యలపై చర్చ జరిగింది. వలస వెళ్లే ఎమ్మెల్యేల విషయం పట్టించుకోవద్దని.. పార్టీ శ్రేణులను కాపాడుకుంటే సరిపోతుందని సిఎం చెప్పుకొచ్చారు. ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ది, సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించాలని కోరారు. వెంటనే కృష్ట జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒకరూ సర్ చార్జీలు పార్టీకి ఇబ్బందిగా మారాయని.. వీటిని ప్రభుత్వం భరిస్తే బాగుంటుదని.. లేకపోతే పార్టీకి నష్టం తప్పదన్నారు. వెంటనే ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని సర్ చార్జీలను ప్రభుత్వం భరించే ప్రసక్తిలేదని అయినా మంత్రివర్గం ఉపసంఘం నివేదిక అందాక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
అంతే కాదు వచ్చే నెలలో రాష్ర్టంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉంటుందని అది కనివిని ఎరుగని రీతిలో ఉండొచ్చని సీఎం హెచ్చరించినట్టు తెలిసింది. కరెంట్ విషయంలో సీఎం దాదాపుగా చేతులెత్తేసే విధంగా మాట్లాడినట్టు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. వెంటనే అక్కడున్న సీనియర్ ఎంపీలు కెవిపి, ఉండవెల్లి పరిస్థితిని ప్రజలకు అర్థమయ్యేలా ఇప్పడ్నించే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి కూడా వారితో ఏకీభవించినట్టు తెలిసింది. అయితే కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాత్రం ఏకీభవించటం లేదు. ప్రజలు ఇప్పటికే కరెంట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. ఈ సారి కరెంట్ గురించిన నాయకులకు ప్రజల నుండి రాళ్లు , కోడిగుడ్లతో సమాధానం చెబుతారని కొంతమంది సీనియర్ రాజకీయ నాయకులు గాంధీ భవన్ లో చెవులు కోరుక్కుంటున్నారు. ప్రజల ముందుకు ప్రజా నాయకులుగా వెళ్లలంటేనే భయమేస్తుందని సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు. సీఎం కు ప్రజల గురించి తెలియదోమో? హైటెక్ యుగాన్ని పరిచయం చేసిన చంద్రబాబునే ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన విషయం మనం తెలుసుకోవాలని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కరెంట్ తో పెట్టుకున్న బాబుకు షాక్ కొట్టిన విషయం తెలుసుకోవాలి. ఆ షాక్ నుండి ఇప్పటికి తేరుకోలేదు. నేను తప్పు చేశానని బాబు ప్రజల మద్య వెళ్లి పాదయాత్ర చేస్తున్న ప్రజలు నమ్మటం లేదు. అలాంటిది మనం కరెంట్ చార్జీలు పెరుగుతాయి, వాటి గురించి ప్రభుత్వాన్ని అడగొద్దు అంటే ప్రజలు ఊరుకుంటారా? కాంగ్రెస్ పార్టీకే షాకిస్తారు? అప్పుడు మనం ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవటమే మన పార్టీ నాయకులు చేయాల్సిందని సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కరెంట్ జోలికి మనం వెళ్లొద్దని కొంత మంది కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more