పూర్వం మనకో సామెత ఉంది. పది జుట్లు కలిసి ఉంటాయి కానీ... రెండు షికెలు కలిసి ఉండవనేది. సాధారణంగా ఇద్దరు ఆడవాళ్ళకు ఒకరంటే ఒకరికి అస్సులు పడదు. ఇక హీరోయిన్ల సంగతి అయితే వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ఇద్దరు హీరోయిన్లు కలిసి ఒక సినిమాలో నటిస్తే... వారి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో చూశాం. తాజా ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్ల మధ్య కూడా వైరం తారా స్థాయికి వెళ్ళిందని సమాచారం. బాలీవుడ్ సెక్సీయెస్ట్ బ్యూటీ అయిన కరీనా కపూర్ కి, ప్రముఖ అందాల రాణి అయిన రాణీ ముఖర్జీ మధ్య పేచీ తారా స్థాయికి చేరిందని టాలీవుడ్ టాక్. వీరిద్దరు బాలీవుడ్ లో టాప్ మోస్ట్ హీరోయిన్స్ కూడా. గతంలో వీరిద్దరు కలిసి చాలా సినిమాల్లో కూడా నటించారు. తాజాగా వీరిద్దరు కలిసి తలాష్ సినిమాలో కూడా నటించారు. ఎప్పటి నుండో మంచి ఫ్రెండ్స్ గా ఉన్న వీరిద్దరు ఈ మధ్యన ఎడమొహంగా , పెడ మొహంగా ఉంటున్నారట. . ఈ మధ్య తలాష్ సినిమా ప్రమోషన్ కార్యక్రమానికి మొదట కరీనా వచ్చి వెళ్లిన తరువాత, రాణీ ముఖర్జీ వచ్చిందట. అంటే కనీసం ముఖం కూడా చూసుకోనంత దూరం ఏర్పడిందని అనుకుంటున్నారు.. ఇక సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య మాటలు లేకపోవడంతో హీరో అమీర్ ఖాన్ ఓ కొరియర్ బాయ్ లా పనిచేసేవాడట. ఇటు సమాచారాన్ని అటు, అటు సమాచారాన్ని ఇటు చేరేసేవాడని యూనిట్ సభ్యుల కథనం. అయితే ఈ విషయం పై వీరు మాత్రం అలాంటివి ఏం లేనట్లు నటిస్తున్నారు.. రాణి ముఖర్జీ కూడా ఓ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ... మా మధ్య ఎలాంటి గొడవ లేదు.. మేం చాలా క్లోజ్ గా ఉంటాం... మా పై ఇలాంటి రాతలు ఎందుకు రాస్తారని ఫైర్ కూడా అయిందట. కరీనా కపూర్ మాత్రం ఈ వార్తల పై స్పందించడానికి కూడా ఇష్టపడటం లేదట. బాలీవుడ్ జనాలు మాత్రం వీద్దరికి ఇంత అగాధం ఏర్పడటానికి కారణాలు వెతికే పనిలో పడ్డారట. చూద్దాం ఏం చెబుతారో ?
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more