ఈ నెల 28న జరగనున్న అఖిలపక్ష సమావేశానికి రాజకీయ పార్టీ రెడీ అవుతున్నాయి. ఈ సందర్భంలో అఖిలానికి కత్తిలాంటి నాయకులను పార్టీలు రెడీ చేస్తున్నాయి. అయితే టీఆర్ఎస్ పార్టీ మాత్రం పది రోజుల ముందే ఇద్దరు పేర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఇద్దరి ఒకరు అవుట్ అయ్యారు. కేసిఆర్ , ప్రొఫెసర్ కోదండరాం అఖిల పక్షనికి హాజరవుతున్నట్లు ప్రకటన చేయటంతో..అనేక విమర్శలు వచ్చాయి. కోదండరాం ఏ పార్టీ హోదా లో అఖిలానికి హాజరవుతారని రాజకీయ పార్టీలు విమర్శులు చేశాయి. అయితే టీఆర్ఎస్ పార్టీ నుండి కేసిఆర్ తో పాటు మరో సినీయర్ నాయకుడు హాజరవుతున్నారు. తెలంగాణపై అఖిలపక్ష సమావేశానికి వెళ్లే ప్రతినిధులను తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) ఖరారు చేసింది. అఖిలపక్షానికి పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావుతోపాటు సీనియర్ పొలిట్బ్యూరో సభ్యులు నాయిని నర్సింహరెడ్డిని పంపించనున్నట్టు టిఆర్ఎస్ ఒక ప్రకటనలో పేర్కొంది. తెలంగాణపై అన్ని పార్టీలుస్పష్టమైన వైఖరిని ప్రకటించాలని టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు డిమాండ్ చేశారు. అఖిల పక్షానికి టిడిపి నుండి చంద్రబాబు నాయుడు వెళ్లాలన్నారు.
టీడీపీ నుండి అఖిల పక్షానికి తెలంగాణ నాయకులు పంపించటానికి పార్టీ సిద్దమైనట్లు తెలుస్తోంది. వారి పేర్లను రేపు ప్రకటిస్తామని టీడీపీ నాయకులు అంటున్నారు. సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి రాఘవులు మాత్రం అఖిలపక్ష సమావేశంలో సమైక్య వాదం వినిపిస్తానని బహిరంగ ప్రకటన చేశారు. ఇక పోతు కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరు అఖిల పక్షనికి హాజరవుతారు అనేది ఇక తెలియాలేదు. ఇప్పుడు అందరి ద్రుష్టి కాంగ్రెస్ పార్టీ పైనే ఉంది. ఈ నెల 28న తరువాత రాష్ట్ర పరిస్థితుల పై ప్రజలు భయపడుతున్నారు. అఖిలపక్ష పేరుతో మళ్లీ రాష్ట్రం పై కొత్త ఆజ్యం పోస్తున్నారని కొంత మంది మేథావులు అంటున్నారు. తెలంగాణ ఇచ్చే ఉద్దేశం ఉంటే ఈ అఖిల పక్ష సమావేశం ఎందుకు? అని రాజకీయ మేథావులు అడుగుతున్నారు. ఈ అఖిల పక్ష సమావేశం వలన రెండు ప్రాంతల నాయకుల్లో, ప్రజల్లోను విభేదాలు పెరగటానికి దారితీస్తుందని రాజకీయ మేథావులు వాపోతున్నారు. రాజకీయ పార్టీల పేరుతో రాష్ట్ర ప్రజలకు తీరని నష్టం తెచ్చున్నారని వారు అంటున్నారు. కొంత మంది అయితే 2009 డి సెంబర్ 9న ఏం జరిగిందే మళ్లీ అదే రిపిట్ అవుతుందని అంటున్నారు. తెలంగాణ సమస్యను త్వరగా తెల్చాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more