విజయవాడలోని ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దేవిశరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు అర్చకులు. ఈ తొమ్మిది రోజలు పాటు అమ్మవారు ప్రతిరోజు ఒక్కో అవతారంలో భక్తలకు దర్శనంతో అనుగ్రహిస్తారు. దేవి శరన్నవరాత్రులు అక్టోబర్ ఐదో తేదీ వరకు కొనసాగుతాయి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
తొలిరోజు దుర్గమ్మ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా కనకదుర్గమ్మ దేవీ భక్తులను అనుగ్రహించగా, రెండవ రోజూన బాలత్రిపుర సుందరి అవతారంలో భక్తులకు అనుగ్రహిస్తున్నారు. అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో బాలాత్రిపుర సుందరి దేవీకి విశిష్టమైన ప్రాధాన్యం ఉంది. శ్రీచక్రంలో కొలువైవుండే బాలత్రిపుర అమ్మవారితోనే అమ్మవారికి శ్రీచక్రయంత్రానికి పూజలు సలుపురాదు. ఎందుకంటే శ్రీచక్రయంత్రంలోని మొదటి అమ్నాయంలోనే బాలాత్రిపుర సుందరీదేవి ఉంటారు. ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బాలాత్రిపురసుందరి అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శక్తిపూజలోనే బాలాత్రిపుర సుందరీ దేవికి విశిష్టత ఉంది.
త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఆవహించి ఉండే శక్తి స్వరూపమే త్రిపుర అని త్రిపురతాపినీ ఉపనిషత్తు చెబుతోంది. త్రిపురుని భార్య త్రిపుర సుందరీదేవి, అంటే గౌరీదేవియే. స్వర్గ, భూ, పాతాళం అనే త్రిపురాల్లో ఉండే శక్తి చైతన్యాన్ని త్రిపురగా వర్ణిస్తారు. శ్రీచక్రంలో ఉండే తొమ్మిది అమ్నయాల్లో మొదటి అమ్నయం త్రిపురసుందరీదేవియే. మనస్సు, బుధ్ధి, చిత్తం, ఆహంకారం త్రిపురసుందరీదేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్తముద్రతో అక్షరమాల ధరించిన ఈమెను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి. నిత్య సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరీ దేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు ఈమే అధిష్టాన దేవత. కాబట్టి ఉపాసకులు త్రిపురసుందరిదేవీ అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు.
విద్యలో మొదటి విద్య బాల అందుకే ఆధ్యాత్మిక విద్యను సాధన చేసేవారు మొదట బాలమంత్రాన్ని ఉపాసన చేస్తారు. బాలాత్రిపుర సుందరీ దేవిని అరుణవర్ణ వస్త్రాలు ధరించి ఎర్రని పూలతో పూజిస్తారు. సత్సంతానాన్ని అనుగ్రహించే దేవతగా త్రిపుర సుందరీదేవి భక్తుల పూజలు అందుకుంటోంది. ఈరోజు రెండు నుంచి పదేళ్ల లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజ చేసి కొత్త బట్టలు పెట్టాలి. "ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపురసుందర్యైనమో నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయాలి. అమ్మవారికి పాయసం నైవేద్యంగా సమర్పించాలి. త్రిశతీ పారాయణ చెయ్యాలి.
అందుకనే బాలత్రిపురసుందరీ దేవి అమ్మవారిని పూజను చేయలేని వారు అమె నామస్మరణను చేసినా సార్థకత్వం లభిస్తుందని అంటారు. ఇక బాలా అంటే చిన్నారి కాబట్టి ఇవాళ చిన్నారి ఆడపిల్లలకు కొత్త బట్టలు, బహుమతులు, ఇత్యాదులను అందజేస్తారు. ఇవాళ బాలత్రిపురాసుందరీ దేవి అమ్మవారికి ప్రీతికరమైన గారెలు, పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారికి ఇవాళ ఎరుపు, ఆకుపచ్చ, పసుపు పచ్చ కలగలపిన చీరను అలంకరించిన ఆలయ అర్చకులు.. భక్తుల కొంగుబంగారమై.. కనువిందు చేసే భాగ్యాన్ని కల్పిస్తున్నారు. తెల్లవారుజామున నాలుగు నుంచి రాత్రి పదిగంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more