తమిళనాడులోని మధురైలో 95 శాతం నిర్మించిన ‘ఎయిమ్స్ బిల్డింగ్ చోరీ’ అయ్యిందని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఆరోపించారు. ఆ నిర్మాణ ప్రాంతానికి వెళ్లి పరిశీలించామని, అయితే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్న 95 శాతం పూర్తయిన మధురై ఎయిమ్స్ బిల్డింగ్ తమకు ఎక్కడా కనిపించలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తమిళనాడులోని మధురైలో గురువారం పర్యటించారు. ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మధురై ఎయిమ్స్ ప్రాజెక్ట్ కోసం రూ.1,264 కోట్లు కేటాయించినట్లు ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
అంతేకాదు ఏకంగా 750 పడకల ఆసుపత్రి పనులు 95 శాతం పూర్తయ్యాయని అన్నారు. స్పెషల్ బ్లాక్ కోసం అదనంగా రూ.164 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. దీంతో మొత్తంగా దాదాపుగా ఎయిమ్స్ అసుపత్రి కోసం ఏకంగా 1428 కోట్ల రూపాయలను కేంద్రం మంజూరు చేసిన విషయాన్ని వారు ఘనంగా చెప్పారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడే అసలు ట్విస్టు ఏర్పడింది. దాదాపుగా 95శాతం పనులు పూర్తైన ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మాణ ప్రాంతాన్ని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్, మధురై ఎంపీ సు వెంకటేశన్ కలిసి పరిశీలించారు. అయితే తమకు ఎక్కడా 95 శాతం పూర్తయిన ఎయిమ్స్ భవనం కనిపించలేదని తెలిపారు.
బహుశా అది చోరీ అయ్యి ఉంటుందని.. ఎవరో ఎయిమ్స్ అసుపత్రిని ఎత్తకెళ్లారని ఎద్దేవా చేశారు. మాజీ వైద్య మంత్రి అయిన నడ్డా, ఎయిమ్స్ ఆసుపత్రి 95 శాతం పూర్తయినట్లుగా అబద్ధాలు చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉందని విమర్శించారు. మీడియాతో కలిసి ఆ స్థలాన్ని సందర్శించిన ఆయన ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మరోవైపు తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి దీనిపై స్పందించారు. మధురై ఎయిమ్స్ నిర్మాణం మొదలుపెట్టే ప్రక్రియ 95 శాతం పూర్తయిందని నడ్డా చెప్పారన్నారు. నిర్మాణ పనులు త్వరలో మొదలవుతాయని ఆయన అన్నట్లుగా ట్విట్టర్లో పేర్కొన్నారు.
We went to the Thoppur AIIMS Madurai site … we found nothing . #MaduraiAIIMS pic.twitter.com/9CBxHEs6Mt
— Manickam Tagore .Bமாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) September 23, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more