ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు గడువును పొడిగించే ఉద్దేశమేదీ కేంద్రానికి లేదని రెవెన్యూ శాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్ అన్నారు. జులై 31లోపు వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులందరూ రిటర్నులు దాఖలు చేయాల్సిందేనని తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జులై 20 నాటికి 2.3 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయని తెలిపారు. అంతకుముందు ఏడాదికి సంబంధించి మొత్తం 5.89 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయి. ఆ ఏడాది రిటర్నుల దాఖలుకు డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చారు.
"రిటర్నుల దాఖలు గడువు పొడిగించడం నిత్యం జరిగేదే అని ప్రజలు భావిస్తుంటారు. అందుకే రిటర్నుల ఫైలింగ్లను నెమ్మదిగా చేస్తూ వచ్చారు. ఇటీవల మాత్రం రిటర్నుల దాఖలు చేయడంలో వేగం పెరిగింది. రోజుకు 15 నుంచి 18 లక్షల రిటర్నులు ఫైల్ అవుతున్నాయి. ఇవి 25 నుంచి 30 లక్షలకు పెరుగుతాయని భావిస్తున్నాం. గతేడాది 9-10 శాతం మంది మంది అంటే 50 లక్షల మంది చివరి రోజు రిటర్నులు దాఖలు చేశారు. ఈ సారి ఆ సంఖ్య కోటికి చేరుతుందని భావిస్తున్నా" అని చెప్పారు.
"గతంతో పోలిస్తే కొత్త ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ ఎంత లోడ్ను అయినా తట్టుకోగలదు. కాబట్టి గడువు పొడిగించే ఉద్దేశమేదీ లేదు" అని తరుణ్ బజాజ్ పేర్కొన్నారు. రిటర్నుల దాఖలు చేసే ప్రక్రియ సైతం సులువుగా ఉందని చాలా మంది ఫీడ్బ్యాక్ ఇచ్చారని చెప్పారు. చాలా మంది రిటర్నులు దాఖలు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రస్తావించగా.. ఇప్పటికే 2.3 కోట్ల మంది ఎలాంటి ఫిర్యాదులూ లేకుండానే రిటర్నులు దాఖలు చేశారని తరుణ్ బజాజ్ పేర్కొన్నారు. కొవిడ్ కారణంగా వరుసగా రెండేళ్ల పాటు రిటర్నుల దాఖలు గడువును కేంద్రం పొడిగిస్తూ వచ్చింది. రిటర్నుల దాఖలు గడువు జులై 31తో ముగస్తున్న నేపథ్యంలో రెవెన్యూ కార్యదర్శి ఈ ప్రకటన చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more