వర్షం పడుతున్నప్పుడు. లేదా రోడ్డుపై నీళ్లు నిలిచినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే స్థానిక పురపాలక సంఘం అధికారులతో పాటు.. విద్యుత్ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. వర్షం పడే సమయంలో విద్యుత్ స్థంబాలను తాకరాదని కూడా వారు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికీ అవగాహనా రాహిత్యంతో గ్రామీణ ప్రాంత ప్రజలు.. అలా చేస్తూనే ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ప్రభావంతో సామాన్య ప్రజల్లోనూ కొంత అవగాహన కలిగింది. అయితే మనుషులకు ఏమైనా చెప్పోచ్చు, కానీ మూగజీవాల సంగతేంటి.?
వర్షం పడుతున్న సమయంలో రోడ్డుపైనున్న విద్యుత్ స్థంబాలను తాకరాదని వాటికి ఎవరు చెప్పాలి. వాటికోసం ఎన్ని బోర్డులు పెట్టినా ఫలితం ఏంటీ.? మాట్లాడమే రాని మూగ జీవాలకు ఇక చదవడం ఎలా వచ్చు.? అందుకనే విద్యుత్ స్థంబాలు ఉన్న చోట దాని చుట్టూ కంచె ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. చుట్టూ నీళ్లు..మధ్యలో స్థంభం.. ఆ స్థంభం వద్దకు వచ్చిన ఓ ఆవు కరెంట్ షాక్తో గిలగిలా కొట్టుకుంది. ఇది చూసి ఓ దుకాణ యజమాని చలించిపోయాడు. వెంటనే ప్రాణాలకు తెగించి ఆ ఆవును కాపాడాడు. మానవత్వాన్ని చాటుకున్నాడు. పంజాబ్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
ఈ వీడియోను ‘అనామిక జైన్ ఆంబర్’ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. ఆవు ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభాన్ని తాకడంతో కరెంటు షాక్కు గురై కొట్టుకుంటోంది. ఆ ఆవును చూసిన దుకాణదారుడు పరుగెత్తుకుంటూ వచ్చి నీట్లోకి దూకాడు. ఓ గుడ్డతో ఆవు కాళ్లను కట్టి లాగాడు. చుట్టుపక్కలవారి సహాయంతో దాన్ని ప్రాణాలతో కాపాడాడు. ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోకు లక్షకుపైగా లైక్స్ రావడం విశేషం. ఆ దుకాణాదారుడిని రియల్ హీరో అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Not all heroes wear capes...
— Righty nor Lefty (@akhilnaithani) July 3, 2022
In Mansa, a cow got electrocuted near an electric pole and started suffering. A nearby shopkeeper dragged the cow with a cloth which saved the life of the cow. #Heroes #TheBoys #india pic.twitter.com/vLep9VJyXZ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more