దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి కేసుల సంఖ్య గత రెండు రోజులుగా నాలుగు వేలకు పైగా కొనసాగుతూ.. ఓ వైపు అందోళన రెకెత్తుతున్న తరఉణంలో కేరళలో మరోసారి మరో మహమ్మారి కలకలం రేగుతోంది. ప్రకృతి సోంతరాష్ట్రంగా అభివర్ణించబడే ఈ రాష్ట్రంలో తాజాగా ఇద్దరు చిన్నారులు నోరా వైరస్ బారిన పడ్డారు. అత్యంత వేగంగా వ్యాప్తిచెందగల నోరా వైరస్ లక్షణాలు కనబడటంతో అసుపత్రికి తరలించగా వారిలో లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. తిరువనంతపురంలో ఇద్దరు పాఠశాల విద్యార్థులకు నోరో వైరస్ సోకిందని కేరళ వైద్యాధికారులు ధ్రువీకరించారు.
డయేరియా-ప్రేరేపిత రోటా వైరస్ మాదిరిగానే ఉన్న ఈ వైరస్ సోకిన పిల్లలకు సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కావచ్చని వైద్యులు హెచ్చరించారు. కలుషిత నీరు, ఆహారం ద్వారా నోరో వైరస్ వ్యాప్తి చెందుతోందని, నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో నీటి పరిశుభ్రతపై సరైన చర్యలు తీసుకుంటే వ్యాధిని అదుపు చేయవచ్చని అధికారులు చెప్పారు. నోరా వైరస్ చాలా ప్రమాదకారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ సూచించారు. ప్రస్తుతం వైరస్ బారినపడ్డ ఇద్దరు చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆమె పేర్కొన్నారు.
అస్వస్థతకు గురైన చిన్నారులకు తొలుత ఫుడ్ పాయిజనింగ్ అయినట్టు భావించారు. కానీ, వైద్య పరీక్షల్లో నోరో వైరస్ నిర్దారణ అయ్యింది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత పిల్లలకు ఈ లక్షణాలు కనిపించాయని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. నోరో వైరస్ సోకిన బాధితులు వాంతులు, విరేచనాలు, తలనొప్పి, ఒళ్లు నొప్పుల వంటి లక్షణాలతో బాధపడుతుంటారు. కొన్ని సందర్భాల్లో శరీరంలోని నీటిశాతం తగ్గిన నిర్జలీకరణానికి దారితీస్తుంది. కలుషిత ఆహారం, నీరు వల్ల ఈ వైరస్ వ్యాప్తిచెందుతుంది. మలవిసర్జన తర్వాత సబ్బుతో పదేపదే చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more