అగ్రరాజ్యం అమెరికాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు తెలుగువాళ్లు మరణించారు. ఈ రెండు ఘటనలు రమరామి ఫ్లోరిడాకు చేరువలోనే చోటుచేసుకున్నాయి. ఈ రెండు ఘటనలకు నీటితో ముడిపడినవే కావడం గమనార్హం. అమెరికాకు వెళ్లి పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగం చేస్తాడని కలలు కన్న ఆ కన్నవారు ఎదురుచూస్తున్నా.. ఆ బిడ్డ మాత్రం తిరిగి రాలేని లోకాలకు తరలివెళ్లాడు. విదేశాల్లో ఎంఎస్ కంప్యూటర్స్ కోసం వెళ్లిన వేములవాడ సుబాష్ నగర్ కు చెందిన కంటే యశ్వంత్.. తన స్నేహితులతో కలసి విహారయాత్రకు వెళ్లి అక్కడ సముద్రంలో శవమై తేలాడు.
స్నేహితులతో కలసి వీకెండ్ సరదాగా గడపటం కోసం ఈనెల 29వ తేది ఐర్లాండ్లోని ఓ ద్వీపానికి బోటింగ్కి వెళ్లారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగా ఎంజాయ్ చేసిన వారు సాయంత్రం తిరిగివస్తున్న క్రమంలో నడిసముద్రంలో పడవ అగిపోయింది. దీంతో సముద్రంలోకి పడవ మునిగిపోతుండడంతో.. సముద్రంలోకి దూకి తరువాత మళ్లీ పడవను అందుకున్నామని అనుకున్నాడు. కానీ అంతలో రాకాసి అల వచ్చి అతడ్ని మింగేసింది. ఆ వెంటనే లైప్ జాకెట్లు వేసుకుని అతని మిత్రులు సముద్రంలో వేతికినా యశ్వంత్ కనిపించలేదు. దీంతో అటు ప్లోరిడాలోని విశ్వవిద్యాలయంతో పాటు ఇటు వేములవాడలో విషాధఛాయలు అలుముకున్నాయి.
మరో ఘటనలో పారాసెయిలింగ్ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన 34 ఏళ్ల వివాహిత మృతి చెందింది. ఏపీలోని బాపట్ల జిల్లా మార్టూరు మండల పరిధిలోని చింతపల్లిపాడు చెందిన ఆలపర్తి శ్రీనివాసరావు భార్య సుప్రజ నదిలో పారాసెయిలింగ్ చేస్తుండగా, వేగంగా వచ్చిన గాలుల తాకిడి అమె ఉన్న పారాసెయిల్ ఆ పక్కనే వున్న వంతెనను గట్టిగా ఢీకొనింది. ఈ ఘటనలో అమె అక్కడికక్కడే మరణించగా, అమె బిడ్డ మాత్రం గాయపడింది. హుటాహుటిన అక్కడకు చేరుకున్న రెస్క్యూటీమ్ చిన్నారిని స్థానిక మత్స్యకారులు కమ్యూనిటీ అసుపత్రిలో ప్రథమ చికి్త్సను అందించి అక్కడి నుంచి నికోలస్ చిల్డ్రన్స్ అసుపత్రికి తరలించారు. ఆలపర్తి శ్రీనివాసరావు.. 2012లో అమెరికా వెళ్లి చికాగోలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తూ అక్కడే స్థిరపడ్డారు.
కొంతకాలం కిందట వీరి కుటుంబం ఫ్లోరిడాకు మారింది. కాగా, ఇతర కుటుంబాలతో కలిసి సుప్రజ, శ్రీనివాసరావు కుటుంబం విహారయాత్రకు వెళ్లగా, అది విషాదాంతంగా మారింది. తమ పిల్లలు అక్షత్ చౌదరి (10), శ్రీ అధిరా (6)లను కూడా విహారయాత్రకు తీసుకెళ్లారు. అయితే, కుమారుడు అక్షత్ తో కలిసి సుప్రజ బోట్ పారాసెయిలింగ్ చేస్తుండగా, బలమైన గాలులు వీయడంతో ఆ పారాచ్యూట్ ను బోటుకు అనుసంధానించిన తాళ్లు తెగిపోయాయి. దాంతో, ఆ పారాచ్యూట్ ఓ వంతెనకు బలంగా తగలడంతో ప్రమాదం సంభవించింది. తీవ్రగాయాలపాలైన సుప్రజ ప్రాణాలు విడవగా, కుమారుడు అక్షత్ కు తేలికపాటి గాయాలయ్యాయి. సుప్రజ మరణంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more