Akbaruddin Owaisi pays homage to Mughal Emperor అక్బరుద్దీన్ ఒవైసీపై ధ్వజమెత్తిన శివసేన, భీజేపి

Bjp shiv sena slam akbaruddin owaisi over visit to aurangzeb s tomb

BJP, Shiv Sena, Akbaruddin Owaisi, Aurangzeb’s tomb, mughal emperor, aurangzeb, aurangabad, Devendra Fadnavis, Akbaruddin insulted "nationalist Muslims", Chhatrapati Shivaji Maharaj, Marathas, Sanjay Raut, Maharashtra, Politics

Akbaruddin Owaisi's visit to the tomb of Aurangzeb at Khuldabad in Maharashtra's Aurangabad district has sparked a row with the Shiv Sena and the Bharatiya Janata Party (BJP) slamming the AIMIM leader. Maharashtra BJP leader Devendra Fadnavis said that AIMIM MLA Akbaruddin Owaisi had insulted "nationalist Muslims" of the country by trying to glorify Aurangzeb. The Shiv Sena also hit out at Akbaruddin Owaisi over his visit to the Mughal emperor’s tomb.

ఔరంగజేబు సమాధిని దర్శించిన అక్భరుద్దీన్.. ధ్వజమెత్తిన శివసేన, బీజేపి

Posted: 05/14/2022 03:43 PM IST
Bjp shiv sena slam akbaruddin owaisi over visit to aurangzeb s tomb

మహారాష్ట్ర పర్యటనలో ఔరంగజేబు సమాధిని దర్శించుకుని, నమాజ్ చేసిన మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చర్యను అధికార శివసేన, ప్రతిపక్ష బీజేపీ ధ్వజమెత్తాయి. ఈ చర్యలతో శాంతియుతంగా వున్న మహారాష్ట్రలో విద్వేషాలు రగల్చాలని ఎంఐఎం భావిస్తోందిని శివసేన అరోపించింది. అలాంటి చర్యలతోనే కనక మజ్లిస్ ప్రణాళికలో ఉన్నట్లయితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చిరించింది. ఇక ఇదే సమయంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపి సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నావిస్ కూడా ఎంఐఎం ఎమ్మెల్యేపై తీవ్రంగా మండిపడ్డారు.

ఔరంగాబాద్ జిల్లా ఖుల్దాబాద్ లో ఔరంగజేబు సమాధిని మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సందర్శించారు. అనంతరం అక్కడ నమాజ్ చేశారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. దీనిపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. ఔరంగజేబును కీర్తించడం ద్వారా అక్బరుద్దీన్ ఒవైసీ భారతీయ ముస్లింలను అవమానిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. ‘‘ఔరంగజేబును కీర్తించే ప్రయత్నాన్ని అక్బరుద్దీన్ చేశారు. ఇది జాతీయ భావం కలిగిన ముస్లింలను అవమానించినట్టు. ఈ దేశంలోని ముస్లింలకు ఔరంగజేబు ఎంత మాత్రం ఆరాధ్యుడు కాడు. శంభాజీరాజాను చంపడానికి ముందు అతడిని హింసించాడు’’ అని దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు.

ఔరంగజేబును ఏ రూపంలో కీర్తించాలన్నా తాము అందుకు ఏమాత్రం అంగీకరించబోమని అన్నారు. ప్రజలను హింసించి పాలించే రాజుగా ఆయన అపకీర్తిని మూటగట్టుకున్నారు. ఆయన మరణించిన తరువాత ఇన్నాళ్లకు ఆయన సమాధిని దర్శించి.. నమాజ్ చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. అలా చేసేవారు ప్రతిచర్యను ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. ‘ఎవరో ఒకరు లీలావతి హాస్పిటల్ (ఎంపీ నవనీత్ రాణా ఎంఆర్ఐ గది వద్ద ఫొటో తీసుకోవడం) వద్ద ఫొటో తీసుకున్నారని చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కానీ, ఈ విషయంలో మాత్రం నోరు మెదపడం లేదు’’ అని ఫడ్నవిస్ విమర్శించారు.

ఈ విషయంపై శివసేన కూడా తీవ్రంగానే స్పందించింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ‘‘ఛత్రపతి శివాజీ మహారాజ్ కు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి ఔరంగజేబు. ఆయన సమాధి ముందు నమాజ్ చేయడం అంటే ఒవైసీ సోదరులు మహారాష్ట్రను సవాలు చేయడమే. ఒవైసీ సోదరులు రాజకీయం చేస్తున్నారు. ఈ మట్టిలోనే ఔరంగజేబును పాతిపెట్టాం. ఆయన అనుచరులు ఎవరైతే ఇక్కడ రాజకీయాలు చేయాలని చూస్తున్నారో వారికీ అదే గతి పడుతుంది’’ అంటూ తీవ్ర హెచ్చరిక చేశారు. అయితే, ఖుల్దాబాద్ కు ఎవరొచ్చినా ఔరంగజేబు సమాధిని సందర్శించడం మామూలేనని, ఇందులో భిన్నమైన అర్థం తీసుకోవాల్సిన అవసరం లేదని ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  Shiv Sena  Akbaruddin Owaisi  Aurangzeb’s tomb  Devendra Fadnavis  Sanjay Raut  Maharashtra  Politics  

Other Articles