నిమ్మకాయల ధరలు కొండెక్కిన విషయం తెలిసిందే. యావత్ భారతంలోనూ ఈ పరిస్థితి అలుముకుంది. వేసవి వస్తే ఇక నిమ్మకాయలు.. గుమ్మడికాయ ధరలకు చేరడం గ్యారంటిగా మారనున్నాయి. ఇన్నాళ్లు కొన్నింటిపైనే పడిన దళారులు కన్ను ఇక సామాన్యులు తినే ఆహారపధార్థులపై కూడా పడింది. దీంతో మండుటెండల్లో నిమ్మరసం తాగడానికి కూడా సామాన్యులు జంకుతున్నారు. అటు దళారులూ కాదు ఇటు జైలు సూపరింటెండ్ కూడా ఈ పరిస్థితిన సోమ్ము చేసుకోవాలని భావించాడు. అయితే ఈ చిన్న తప్పు ఆయన మొత్తం జీతానికే ఎసురు తెచ్చింది. అంతేకాదు తన కెరీర్ లోనూ మాయని మచ్చను తెచ్చింది.
ఐపీఎస్ అధికారులే జైలు సూపరింటెండెంట్లుగా వ్యవహరిస్తుంటారు. అయితే ఈ స్థాయి అధికారులు చిన్నాచితక మొత్తంలో అవినీతికి పాల్పడరని ప్రభుత్వాలు నమ్ముతాయి. కానీ ప్రభుత్వాలు నమ్మకాలను వమ్ము చేస్తూ.. ఈ ఐపీఎస్ అధికారి అవినీతికి తెరలేపారు. ఇక వేసవి నేపథ్యంలో జైలులోని ఖైదీలు మండుటెండను తట్టుకుని ఉండేందుకు నిమ్మకాయలను పంచాడు. అదే అతని పదవికి ఎసరు తెచ్చింది. ఔనా నిమ్మకాయలు ఇస్తే మంచిదేగా అంటారా.? అయితే ఇస్తే బాగానే ఉండేది కానీ ఇవ్వకుండానే ఇచ్చినట్లు చె్ప్పి కుంభకోణానికి తెరలేపడంతోనే అతని ఉద్యోగానికి ఎసరు వచ్చింది.
వేసవి నేపథ్యంలో జైలులో ఖైదీలకు నిమ్మకాయలు అందిస్తున్నట్లు బిల్లులు సృష్టించాడు. డబ్బుకోసం ప్రభుత్వానికి బిల్లులు పంపించాడు. అయితే జైలులో ఉన్న ఖైదీ రాష్ట్ర మంత్రికి లేఖ రాయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఇంకేముంది జైలు అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గుర్నమ్ లాల్.. అనే ఐపీఎస్ అధికారి పంజాబ్లోని కపుర్తల మోడర్న్ జైలు సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 15-30 తేదీల మధ్య జైలులో 50 కిలోల నిమ్మకాయలు వినియోగించామని, వాటికి కిలోకు రూ.200 చొప్పున మొత్తం రూ.10 వేలకు కొనుగోలు చేశామని ప్రభుత్వానికి బిల్లులు సమర్పించారు.
అయితే జైలు అధికారి అవినీతికి పాల్పడుతున్నాడని, తప్పుడు రేషన్ బిల్లులు ప్రభుత్వానికి పంపుతున్నాడని, ఆ బిల్లుల్లో పేర్కొన్న కూరగాయలు తమకు ఒక్కసారిగా వడ్డించలేదని రాష్ట్ర జైళ్లశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్కు ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రి విచారణకు ఆదేశించారు. అవన్నీ తప్పుడు బిల్లులని, అసలు జైలులో ఉన్న స్టాక్కు.. బిల్లులకు పొంతన లేదని, నిబంధనల ప్రకారం ఖైదీలకు ఆహారం అందించడం లేదని, నిమ్మకాయల కుంభకోణానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. దీంతో ప్రభుత్వం జైలు సూపరింటెండెంట్ గుర్నమ్ను సస్పెంట్ చేసింది. అతనిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more