Covid 4th wave may peak after June: Karnataka minister కరోనా నాలుగో దశ: జూన్ నుంచి అక్టోబర్ వరకు కొనసాగనుందన్న మంత్రి

Covid 4th wave may peak after june have its effects till oct karnataka health minister

Corona fourth wave, June, lasts till Septmebet to October, IIT Kanpur, corona omicron variant, Omicron sub variants, Omicron Sub Variants, Omicron BA1, Omicron BA2, Omicron XE variant, k sudhakar, covid fourth wave india, covid 19,covid, Bengaluru, karnataka

The Covid fourth wave may peak in the state by June-end and last till October, said Health Minister Dr K Sudhakar here on Tuesday. Warning that the numbers are already rising, he said the people have to learn to live with the virus, but should ensure full vaccination and wear masks.

కరోనా నాలుగో దశ: జూన్ నుంచి అక్టోబర్ వరకు కొనసాగనుందన్న మంత్రి

Posted: 04/27/2022 12:36 PM IST
Covid 4th wave may peak after june have its effects till oct karnataka health minister

దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో కరోనా ఆర్ వాల్యూ కూడా పెరుగుతోంది. ఇది దేనికి సంకేతమన్న ప్రశ్నలు గతవారంలోనే అక్కడి స్థానికుల్లో ఉత్పన్నమయ్యాయి. కాగా ఇది నాలుగో దశ కరోనా వేవ్ కు కారణమా.? అన్న అనుమానాలు కూడా వ్యక్తం కాగా, అది నిజమేనని తాజాగా బీజేపి పాలిత కర్ణాటక మంత్రి స్సష్టం చేశారు. కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ కరోనా నాలుగో దశపై కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కరోనా ఫోర్త్ వేవ్ జూన్ తర్వాత గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని, అక్టోబరు వరకు దాని ప్రభావం ఉంటుందని అన్నారు.

బెంగళూరులో పాత్రికేయుల సమావేశంలో ఆయన కరోనా నాలుగో దశకు సంబంధించిన వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు కాన్పూరు ఐఐటీ నిపుణులు అంచనా వేశారని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరు కరోనా ప్రోటోకాల్ ను తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు. వ్యాక్సిన్లు తీసుకోనివారు వాటిని వేయించుకోవాలని, మాస్కులు ధరించడం, శానిటైజర్ ను చేతులకు రుద్దడంతో పాటు సామాజిక దూరాన్ని పాటించడం.. ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా కాన్పూరు ఐఐటీ పరిశోధకులు ఇచ్చిన నివేదికలోని విషయాలను మంత్రి వెల్లడించారు.

కాన్పూర్ ఐఐటీ అంచనాల ప్రకారం జూన్ చివరలో కరోనా ఫోర్త్ వేవ్ ప్రారంభమై ఆ తర్వాత గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. ఈ ప్రభావం సెప్టెంబరు నుంచి అక్టోబరు వరకు కొనసాగే అవకాశం ఉంది. కరోనాపై కాన్పూరు ఐఐటీ శాస్త్రవేత్తలు వేసిన అంచనాలు నిజమయ్యాయని, కాబట్టి తాజా నివేదికలోని అంశాలు కూడా నిజమయ్యే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మునుపటిలా జాగ్రత్తగా ఉండాలని, వ్యాక్సిన్లు వేయించుకోవాలని, మాస్క్ తప్పకుండా ధరించాలని, భౌతికదూరం పాటించాలని, శానిటైజర్లు ఉపయోగించాలని మంత్రి సూచించారు. అలాగే, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటకలో కొవిడ్ నాలుగో దశ కేసులు స్వల్పంగా ఉన్నట్టు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : K Sudhakar  COVID 19  COVID cases  Fourth COVID Wave  IIT Kanpur  Omicron variant  Bengaluru  karnataka  

Other Articles