యెమెన్లో తీవ్ర సంక్షోభం చోటుచేసుకున్న తరుణంలోనూ భారత్ కు చెందిన ఏడుగురు నామికులు మూడు నెలల తరువాత ఇవాళ స్వేచ్ఛా వాయువును పీల్చుకున్నారు. హౌతీ నియంత్రణలో వున్న యెమెన్ రాజధాని సనా నుంచి మొత్తంగా 14 మంది విదేశీయులను విడుదల అయ్యారు. కాగా అందులో ఏడుగురు భారత్ కు చెందిన నావికులు ఉన్నారు. యూఏఈ జెండాతో కూడిన వాణిజ్య నౌక హౌతి తిరుగుబాటు దారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ప్రయాణిస్తున్న వారందరినీ తమ అదుపులోకి తీసుకుని నిర్భంధంలో ఉంచి విషయం తెలిసిందే.
మూడునెలల పాటు హౌతీ తిరుగుబాటుదారుల చేరలో బందీలున్న ఉన్న వారంతా విడుదలయ్యారు. యెమెన్ రాజధాని సనాలో ఆదివారం విడుదలైన 14 మంది విదేశీయుల్లో ఏడుగురు భారతీయ నావికులు ఉన్నారని ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యిద్ అల్బుసైది పేర్కొన్నారు. మొత్తంగా కెప్టెన్ కార్లోస్ దేమాటా, మహ్మద్ జాషిమ్ ఖాన్, అయెనాచెవ్ మెకోనెన్, దీపాష్ మూటా పరంబిల్, అఖిల్ రేగు, సూర్య హిదాయత్ ప్రథమ, శ్రీజిత్ సజీవన్, మహమ్మద్ మున్వర్ సమీర్, సందీప్ సింగ్, ల్యూక్ సైమన్స్ మరియు అతని భార్య మరియు బిడ్డ, మౌంగ్ థాన్ విఎస్ఎస్జి వాసంశెట్టిని యెమెన్లో కస్టడీ నుంచి విడుదల చేశామని రు' అని అల్బుసైది ట్విట్టర్లో ద్వారా తెలిపారు.
విడుదలైన భారతీయులు ప్రస్తుతం ఒమన్ సంరక్షణలో ఉన్నారని వారిని సురక్షితంగా పంపుతామని ఆయన తెలిపారు. మూడు నెలల కిందట యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాణిజ్య నౌకను స్వాధీనం చేసుకున్న తర్వాత యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు భారతీయ నావికులతో పాటు దేశాలకు చెందిన వారిని బంధీలుగా పట్టుకున్నారు. కాగా ఏడుగురు భారతీయు నావికులను యెమెన్ సైనికులు విడుదల చేయడంతో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రోఫెసర్ జైశంకర్ యెమెన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఒమన్ దేశం చేసిన సాయానికి ఆయన ధన్యవాదలు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more