అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థులు అసువులు బాసారు. తమ కళాశాలలో తరగతులు ముగించుకుని వెళ్తున్న విద్యార్థుల కారును స్థాన్థిక మహిళ కారు వచ్చి ఎదురుగా ఢీకొనింది. దీంతో సదరు మహిళ సహా ఇద్దరు తెలుగు విద్యార్థులు ఘటనాస్థంలోనే మరణించారు. కాగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మరో తెలుగు విద్యార్థికి పరిస్థితి విషమంగా ఉంది. అమెరికాలోని ఇల్లినాయిస్ మూడవ జాతీయ రహదారిపై యూనియన్ కౌంటీలో స్థానిక కాలమానం ప్రకారం గురువారం తెల్లవారు జామున ఈ ఘటన చోటుచేసుకుంది.
రెండు కార్లు ఢీకొన్న ఈ ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో వారు టౌన్ కౌంటీ నుంచి ఈస్ట్ కేప్కు వేగంగా వెళుతున్న సమయంలో మిస్సౌరీలోని కేప్ గిరార్డియూకు చెందిన స్థానిక మహిళ ఫియట్ కారు వచ్చి తెలుగు విద్యార్థులు వెళ్తున్న కాను ఢీకొనింది. ఈ ఘటనలో స్థానిక మహిళ అతివేగంగా కారును నడిపిస్తూ అదుపుతప్పి సెంటర్ లైన్ దాటి పక్కరోడ్డుపైకి దూసుకువెచ్చి తెలుగు విద్యార్థులు వెళ్తున్న టయోటా కారును ఢీకొంది. ఈ ఘటనలో ఫియట్ కారు నడుపుతున్న డ్రైవర్ మారీ మ్యూనియర్ (32) మరణించారు.
అమెతోపాటు తమ కారులో ప్రయాణిస్తున్న వంశీ పెచ్చెట్టి (23), టయోటా కారు నడుపుతున్న పవన్ స్వర్ణ (23) అక్కడికక్కడే కన్నుమూశారు. టయోటా కారులో ప్రయాణిస్తున్న యశ్వంత్ ఉప్పలపాటి, కాకుమాను కార్తీక్, డోర్న కల్యాణ్లకు తీవ్ర గాయాలయ్యాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈ ఐదుగురు విద్యార్థులు కాబండేల్ టౌన్లోని సదరన్ ఇలినాయిస్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్నట్లు ఇల్లినాయిస్ స్టేట్ పోలీసు విభాగం గుర్తించింది. వీరిలో కల్యాణ్ సివిల్ ఇంజనీరింగ్ చదువుతుండగా.. మిగిలిన వాళ్లంతా కంప్యూటర్ సైన్స్ అభ్యసిస్తున్నారు. ప్రమాద తీవ్రత నేపథ్యంలో అక్కడి పోలీసులు రూట్ 3ని కొన్ని గంటల పాటు మూసేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more