కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా రాష్ట్రంలోని దేవాలయాలన్ని భక్తులను దూరంగా పెట్టాయి. కేవలం ఆలయ అర్చకులు మాత్రమే నిత్యకైంకర్యాలు నిర్వహించి దూప దీప నైవేద్యాలను మూలవిరాట్టులకు సమర్పించిన విషయం తెలిసిందే. అయితే కరోనా మహమ్మారి ప్రభావం దేశంలో ఎక్కడా లేకుండా పోవడం.. ఇదే క్రమంలో అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రాలు కూడా కరోనా పాన్ డమిక్ ఆంక్షలను ఎత్తివేసి.. మాస్క్ ధరించే అంశంలో ప్రజల ఇష్టాఇష్టంపై వదిలేసిన తరుణంలో.. తమ పట్ల అనుగ్రహం చూపిన దేవుళ్లను దర్శించుకునేందకు భక్తులు పోటీ పడుతున్నారు.
ఇక అందులోనూ ఉగాది పర్వదినం సందర్భంగా జ్యోతిష్యులు చెప్పిన పూజలను చేసుకునేందుకు.. దైవదర్శనాల కోసం క్యూలైన్లలో బారులు తీరారు. ఈ క్రమంలో ఇటీవల తిరుపతిలో సర్వదర్శన టోకన్ల వద్ద జరిగిన తోక్కిసలాటే ఇందుకు నిదర్శనం. ఇదే క్రమంలో భక్తులు శ్రీకాళహస్తి దేవాలయంలోనూ పోటెత్తారు. అయితే ఇవాళ ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యానారాయణ. అయితే మంత్రి హోదాలో తొలిసారిగా దేవాలయానికి వచ్చిన ఢిఫ్యూటీ సీఎంకు అక్కడ పరాభవం ఎదురైంది.
క్యూలైన్లలోనే తమను గంటలపాటు నిల్చోబెట్టి ఆలయఅధికారులు తమకు మంచినీరు, ఇతర పౌకర్యాలను కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. క్యూలైన్లలోని చిన్నారులు, పెద్దలు మంచినీరు కోసం, ఆహారం కోసం అలమటిస్తున్నారని భక్తులు వాపోయారు. క్యూలైన్లో ఉన్న భక్తుల గురించి పట్టించుకునే నాధుడే కరువయ్యాడని విమర్శించారు. దీంతో క్రమంగా భక్తులలో కోపం కట్టలు తెంచుకుని మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉపముఖ్యమంత్రి డౌన్ డౌన్.. మంత్రివర్యా గో బ్యాక్ అంటూ పెద్దపెట్టున నినదించడంతో అప్పుడే పూజలు నిర్వహించుకున్న వెళ్తున్న మంత్రి వాటిపై ప్పందించారు.
నేరుగా ఆయన క్యూలైన్లలో నినాదాలు చేస్తున్న భక్తుల వద్దకు వెళ్లి సమస్యను తెలుసుకున్నారు. దీంతో కొంత సంయమనం పాటించిన భక్తులు ఇక తమ సహనాన్ని ఆలయ అధికారులు పరీక్షిస్తున్నారని మంత్రికి పిర్యాదు చేశారు. వేసవిలో మండుటెండలో క్యూలైన్లలో నిలబడిన తమను ఏమాత్రం పట్టించుకోకుండా ఇలా వ్యవహరిచడం సముచితం కాదని భక్తులు మంత్రికి దృష్టికి తీసుకువచ్చారు. ఆలయ అధికారులు భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. మంత్రి డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేశారు. మంత్రి భక్తుల వద్దకు వచ్చి సర్ధి చెప్పి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more