తమిళనాడు రాజధాని చెన్నై విమానాశ్రయం నుంచి అమెరికాకు స్మగ్లింగ్ చేసేందుకు సిద్దంగా ఉన్న అతిపురాతన కాలానికి చెందిన భగవత్ దేవతా విగ్రహాన్ని ఎయిర్ కార్గో కస్టమ్స్ అధికారులు భగ్నం చేశారు. 19వ శతాబ్దానికి చెందిన నాగాభరణంతో కూడిన శివలింగం విగ్రహాన్ని అమెరికాకు అక్రమంగా తరలించేందుకు చేసిన ప్రయత్నాన్ని చెన్నై ఎయిర్ కార్గో కస్టమ్స్ స్వాధీనం చేసుకున్నారు. త్రిశూలంలోని కార్గో కేంద్రం నుంచి అమెరికాకు పంపించాల్సిన సరుకులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయడంతో 1800 నాటి ప్రాచీన విగ్రహం బయటపడింది.
విగ్రహానికి సంబంధించిన ఎగుమతి పత్రాలు (షిప్పింగ్ బిల్లు) పరిశీలించిన అధికారులకు తంజావూరు జిల్లాలోని కుంభకోణంలో ఉన్న ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎంపోరియం నుండి కొనుగోలు చేసినట్లు తెలిసింది. విగ్రహం కోసం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) నుండి నాన్-యాంటిక్విటీ సర్టిఫికేట్ ఎగుమతిదారు సమర్పించలేదని అధికారులు గుర్తించారు. కాగా అధికారుల విచారణలో ఈ పంచలోహ విగ్రహం కళ్లకురిచ్చి జిల్లా తిరునావలూరు సమీపంలోని గెడిలంలోని ఓ వ్యక్తి నుంచి లభ్యమైనట్లు నిఘా వర్గాలు నిర్ధారించాయి.
అయితే ఈ విగ్రహం ఆర్ట్స్ అండ్ క్రాప్ట్స్ ఎంపోరియం నుంచి కొనది కాదని తెలీయడంతో అధికారులు పురావస్తు పరిశోధనా అధికారులను రంగంలోకి దింపి పరీక్షలు నిర్వహింరచారు. వారు నిర్వహించిన దృశ్య పరీక్షలో శివలింగ నాగాభరణ విగ్రహం అతిపురాతనమైనదిగా (1800వ సంవత్సారానికి) చెందినట్లుగా కనుగొన్నారు. ఈ శివలింగ నాగాభరణ పంచలోహ విగ్రహం 36 సెం.మీ (మూడున్నర అడుగుల) ఎత్తు, 4.56 కిలోల బరువు ఉందని అధికారులు తెలిపారు. ఎయిర్ కార్గో కస్టమ్స్ అధికారులకు ఈ విగ్రహం స్మగ్లింగ్ చేస్తున్నారన్న పక్క సమాచారం అందడంతో.. త్రిశూలంలోని కేంద్రంపై దాడి చేశారు. ఈ పురాతన విగ్రహంతో పాటు ఎగుమతి కోసం నమోదు చేసిన ఇతర వస్తువులను కస్టమ్స్ చట్టం, 1962, పురాతన వస్తువుల చట్టం కింద స్వాధీనం చేసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more