ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయంపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. ‘ఏపీకి మూడు రాజధానులా?’ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజధాని లేని రాష్ట్రానికి ముందు ఒక రాజధానిని కట్టండీ ఆ తరువాత మూడు రాజధానుల విషయమై ఆలోచించండీ అని సూచించారు. కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి, ఏపీ మహిళా కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మ ఆధ్వర్యంలో అమరావతి రైతుల ప్రతినిధి బృందం హస్తినకు వెళ్లి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను కలిసి సమస్యలు వివరించింది.
ఈ సందర్భంగా శరద్ పవార్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ కంటే పెద్దదైన మహారాష్ట్రకు రెండు రాజధానులే ఉన్నాయన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే ముంబాయి దేశ అర్థిక రాజధానిగా, రాష్ట్ర రాజధానిగా అన్ని విధాలుగా శరవేగంగా పరుగులు పెడుతున్నా.. అందులో సగం శాతం కూడా మరో రాజధాని అభివృద్ది సాగడం లేదని తేల్చిచెప్పారు. మహారాష్ట్ర మరో రాజధాని విదర్భ అభివృద్ధి చెందలేదని గుర్తు చేశారు. మూడు రాజధానులు మాటను పక్కనబెట్టి ఉన్న రాజధానిని అభివృద్ది చేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్ హైదరాబాద్ నుంచి పాలిస్తున్నారా? అని రైతులను ప్రశ్నించారు. దీనికి రైతులు బదులిస్తూ అమరావతిలో గత ప్రభుత్వం కట్టిన శాసనసభ, సచివాలయం నుంచే ఆయన పని చేస్తున్నారని బదులిచ్చారు. అమరావతి నిర్మాణంపై అప్పట్లో చంద్రబాబు తనకు వివరించారని, ఆ ప్రణాళిక ఎంతో అద్భుతంగా ఉందని పవార్ గుర్తు చేసుకున్నారు. కొత్త రాష్ట్రం అద్భుతమైన రాజధానిని నిర్మించు కుంటోందని చాలా సంతోషించామని చెప్పారు.
ఉన్న రాజధాని నుంచే పనిచేయలేని వ్యక్తి మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారని ఆయన సందేహం వ్యక్తం చేశారు. అమరావతే ఏపీ రాజధాని అన్న కోర్టు తీర్పును కూడా జగన్ పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా రైతులు శరద్ పవార్ దృష్టికి తీసుకెళ్లారు. బీజేపీ నేతలు అమరావతికే మద్దతు తెలుపుతున్నా కేంద్రం నుంచి సరైన మద్దతు లభించడం లేదని రైతు ప్రతినిధులు వాపోయారు. దీంతో అమరావతికి తమ పార్టీ తరపున పార్లమెంటులో మద్దతు ఇస్తామని పవార్ ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more