తిరుమల కొండకు భక్తుల తాకిడి పెరిగే వేసవికాలంలో ఇక్కడ గజరాజులు కూడా చేరుకుని హల్చల్ చేస్తున్నాయి. గత వారం రోజులుగా చిత్తూరు జిల్లాలో అడవి ఏనుగులు గ్రామాలలోకి ప్రవేశించి.. ఓ వైపు పంటను నాశనం చేస్తూనే.. మరోవైపు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శేషాచలం అడువుల్లోంచి తిరుమలకు చేరుకున్న గజరాజులు అక్కడ నాలుగు రోజులుగా తిష్టవేసి.. భక్తులను కలవరపెడుతున్నాయి. తిరుమల నుంచి పాపవినాశనంకు వెళ్లే రహదారిలో రోడ్డులో టోల్ గేట్ సమీపంలో తిష్ఠ వేసిన గజరాజులు ఆకాశగంగ ప్రాంతంలో రహదారిపైకి వచ్చాయి.
అయితే గజరాజులు వున్నాయన్న సమాచారం అందుకున్న స్థానికులు కాసింత జాగ్రత్తగా వ్యవహరించి.. తమ ద్విచక్రవాహనాలపై వెళ్తూ.. తమ సెల్ ఫోన్ లో వీడియో రికార్డింగ్ అప్షన్ ను అన్ చేసుకుని పాప వినాశనం మార్గం మీదుగా ఆకాశగంగకు చేరుకునేందుకు వెళ్లారు. అలా వెళ్తుండగా, టోల్ గేట్ సమీపిస్తుందన్న సమయంలో వారికోసమే అన్నట్లుగా రోడ్డుపైనున్న చెట్ల చాటున మాటువేసిన గజరాజు వారు సమీపించగానే ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చింది. దీంతో వారు వెంటనే వెనక్కు తిప్పుకుని వస్తుండగా, గజరాజు కూడా కొంతదూరం వారిని వెంబడించింది. ఆ వెంటనే మరో ఏనుగు కూడా వారికోసం రోడ్డుపైకి వచ్చింది.
దీంతో ద్విచక్రవాహనంపై వెనుక కూర్చున్న వ్యక్తి వెగంగా వెళ్లు.. అని వాహనచోదకుడికి చెప్పడం వీడియోలో వినిపించింది. అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చి.. తనపై దాడి చేసేందుకు యత్నించిన ఏనుగుల నుంచి తప్పించుకోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఏనుగు కొంతదూరం వెంబడించడంతో ద్విచక్రవాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఏనుగులను అరణ్యంలోకి తరిమేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు సఫలమయ్యాయి. దీంతో కొద్ది సమయం తరువాత ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఏనుగులను అడవిలోకి మళ్లించిన తరువాత రాకపోకలకు అధికారులు అనుమతిచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more