అత్యాచారం కేసులో మేఘాలయ రాష్ట్రోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించింది. మహిళ జననేంద్రియాలను లో దుస్తుల పై నుంచి పురుషాంగంతో తాకినా.. దానిని అత్యాచారంగానే పరిగణించాల్సి ఉంటుందని తీర్పు వెల్లడించింది. ఇది పెనట్రేటివ్సెక్స్ కిందికి వస్తుందని మేఘాలయ హైకోర్టు ధర్మాసనం తీర్పును వెలువరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ బెనర్జీ నేతృత్వంలో జస్టిస్ డబ్యూ డైంగ్డోతో కూడిన న్యాయస్థాన ధర్మాసనం కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. మహిళ యోని లేదా మూత్రనాళంలోకి ఏదైనా చొప్పించడం శిక్షా స్మృతిలోని సెక్షన్375(బి) ప్రకారం అత్యాచారమే అవుతుందని తీర్పు వెలువరించారు.
2006 లో తనపై అత్యాచారం జరిగిందని పదేళ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అత్యాచారం జరిగినట్లు నిర్ధరించారు. ఈ క్రమంలో 2018 లో స్థానిక కోర్టు.. నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా విధించింది. అప్పుడు నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. కానీ ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు ఇటీవల హైకోర్టును ఆశ్రయించాడు. తన వాదనను అధికారులు తప్పుగా అర్థం చేసుకున్నారని, బాలికపై లైంగిక చర్యకు పాల్పడలేదని, లో దుస్తుల పై నుంచి పురుషాంగంతో తాకానని వాదించారు. ఇతడి వాదనలు విన్న ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెల్లడించింది. నిందితుడు శిక్షార్హుడేనని పేర్కొంది.
గతంలోనూ నాగపూర్ బెంచ్ ఇచ్చిన తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టేసింది. దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపుల కిందకు రాదంటూ బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఓ బాలిక దుస్తులపై నుంచి తాకినంత మాత్రాన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెప్పలేమని, చట్టం ఇదే విషయాన్ని పేర్కొంటుందంటూ అప్పట్లో బాంబే హైకోర్టు వ్యాఖ్యానించడం సంచలనం రేపింది. లైంగిక ఉద్దేశంతో బాలిక దుస్తులు తొలగించి, లేదా దుస్తుల లోపలకి చేయి పెట్టి నేరుగా తాకితేనే అది లైంగిక వేధింపుల కిందకు వస్తుందని వెల్లడించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more